Saturday, October 5, 2024
HomeతెలంగాణTTD member: సీతా రంజిత్ రెడ్డికి సీఎం కేసీఆర్ ఆశీర్వదం

TTD member: సీతా రంజిత్ రెడ్డికి సీఎం కేసీఆర్ ఆశీర్వదం

సీఎం ఆశీర్వాదం తీసుకున్న సీత

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలి సభ్యురాలుగా నామినేట్ అయిన తర్వాత తొలిసారిగా గడ్డం సీతా రంజిత్ రెడ్డి ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా తనకు టీటీడీ పాలక మండలి సభ్యురాలిగా అవకాశం కల్పించినందుకు సీఎం కేసీఆర్ కి ఆమె ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపి, ఆశీర్వాదం తీసుకున్నారు. సీఎం కేసీఆర్ సీతారెడ్డికి శుభాకాంక్షలు తెలిపి, ఆశీర్వదించారు. సీఎం కేసీఆర్ ను కలిసిన వారిలో మన చేవెళ్ల ఎంపీ డాక్టర్ జి.రంజిత్ రెడ్డి, వారి కుమారుడు రాజ్ ఆర్యన్ రెడ్డి తదితరులు ఉన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News