Saturday, September 21, 2024
HomeతెలంగాణHuzurabad: విధి నిర్వహణలో లైన్‌మెన్‌ ప్రాణాలే పణం

Huzurabad: విధి నిర్వహణలో లైన్‌మెన్‌ ప్రాణాలే పణం

వైరల్ అవుతున్న పిక్

ఓ జూనియ‌ర్ లైన్‌మెన్ తన ప్రాణాల‌ను ఫ‌ణంగా పెట్టి.. గ్రామానికి క‌రెంట్‌ను పున‌రుద్ధ‌రించాడు.. చెరువు మ‌ధ్య‌లో ఉన్న విద్యుత్ స్తంభం వ‌ర‌కు ఈదుకుంటూ వెళ్లి.. డిస్క్ మార్చి గ్రామానికి విద్యుత్‌ను అందించారు. జూనియ‌ర్ లైన్‌మెన్‌పై విద్యుత్ అధికారులు, గ్రామ‌స్తులు ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు.
గ్రామస్తులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి… హుజురాబాద్ డివిజన్‌లోని రాజపల్లి 33/11కేవీ సబ్ స్టేషన్ నుంచి చెల్పూరుకు 11 కేవీ ఎక్స్ ప్రెస్ ఫీడర్ లైన్ స్థానికంగా ఉన్న చెరువులో నుంచి వెళుతుంది. ఆదివారం ఉదయం చెరువులో ఉన్న ఒక స్తంభంపై 11కేవీ లైన్ బ్రేక్ డౌన్ అయి సరఫరాకు అంతరాయం ఏర్పడింది. చెల్పూరు జేఎల్ఎం వెంకటేశ్వర్లు, ఏఎల్ఎం ప‌రుశురాం, లైన్ ఇన్‌స్పెక్టర్ సమ్మయ్య చెరువులోకి ఈత కొట్టుకుంటూ వెళ్లి లైన్‌కు మరమ్మతులు చేసి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు.
చెరువులో ఉన్న విద్యుత్ స్తంభం వద్దకు ఈత కొడుతూ వెళ్లి సరఫరాను పునరుద్ధరించిన సిబ్బందిని ఎస్ఈ గంగాధర్, అధికారులు అభినందించారు. బ్రేక్ డౌన్‌ను సరి చేసేందుకు విద్యుత్ సిబ్బంది చెరువులోకి వెళ్లి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించి తిరిగి బయటకు వచ్చే వరకు తీసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News