Sunday, October 6, 2024
Homeఆంధ్రప్రదేశ్Nandyala Collector: ప్రభుత్వ ఆసుపత్రులలోనే కాన్పులు జరగాలి

Nandyala Collector: ప్రభుత్వ ఆసుపత్రులలోనే కాన్పులు జరగాలి

నెలవారీ లక్ష్యాలను ఖచ్చితంగా సాధించాలి

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రభుత్వ ఆసుపత్రిలలోనే గర్భిణీ స్త్రీలు జన్మనిచ్చేలా అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డా. మనజిర్ జిలాని సమూన్ వైద్యాధికారులను ఆదేశించారు. మంగళవారం రాత్రి ఆలస్యంగా కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులతో సమీక్ష నిర్వహించారు. డిఎంహెచ్ఓ డా. వెంకటరమణ, డిసిహెచ్ఎస్ కోఆర్డినేటర్ డా.జఫ్రూళ్ల, జిజిహెచ్ సూపరింటెండెంట్ డా.వరప్రసాద్, ఆరోగ్యశ్రీ డిస్టిక్ కోఆర్డినేటర్ రూపేంద్ర నాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డా. మనజిర్ జిలాని సమూన్ మాట్లాడుతూ అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రభుత్వ ఆసుపత్రులలో లక్ష్యం మేరకు ప్రసవాలు జరిగేలా అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవాలని మెడికల్ అధికారులను, వైద్య సిబ్బందిని ఆదేశించారు. పిహెచ్ సీలలో కాన్పులు కష్టమై సిజరిన్ చేసే పరిస్థితులు ఏర్పడితే సమీప సిహెచ్ సి లు, ఏరియా ఆసుపత్రులకు రెఫర్ చేసి పంపాలని కలెక్టర్ ఆదేశించారు. పేద ప్రజలు అనవసరంగా ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లి డబ్బు వృధా చేసుకోకుండా… ప్రభుత్వ ఆసుపత్రులలో అన్ని సౌకర్యాలు ఉన్నాయని గర్భిణీ స్త్రీలలో అవగాహన కల్పించడంతో పాటు హైరిస్క్ గర్భిణీ స్త్రీలను గుర్తించి ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే డెలివరీలు అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఏఎన్ఎం, ఆశా వర్కర్లు తదితర వైద్య సిబ్బందిని కలెక్టర్ ఆదేశించారు. ప్రభుత్వం పేద ప్రజల ఆరోగ్య నిమిత్తం నిర్దేశించిన నెలవారీ లక్ష్యాలను ఖచ్చితంగా సాధించాలని కలెక్టర్ సూచించారు.బనగానపల్లి వంద పడకల ఆసుపత్రి స్థాయికి చేరుకున్న నేపథ్యంలో చుట్టుపక్కల గ్రామాలైన ఉప్పలపాడు, అవుకు, టంగుటూరు, పలుకూరు తదితర పిహెచ్సిలను అనుసంధానం చేసి రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు. అలాగే డోన్ లోని వంద పడకల ఆసుపత్రికి కూడా చుట్టుపక్కల గ్రామాల ను అనుసంధానం చేసి వైద్య సేవలు అందించాలని కలెక్టర్ వైద్య సిబ్బందిని ఆదేశించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News