Saturday, October 5, 2024
Homeనేషనల్Manipur Road Accident : విషాదాన్ని నింపిన స్ట‌డీ టూర్‌.. 15 మంది విద్యార్థుల దుర్మ‌ర‌ణం

Manipur Road Accident : విషాదాన్ని నింపిన స్ట‌డీ టూర్‌.. 15 మంది విద్యార్థుల దుర్మ‌ర‌ణం

Manipur Road Accident : విజ్ఞాన యాత్ర విషాదాన్ని నింపింది. ఎంతో ఉత్సాహాంగా బ‌య‌లుదేరిన విద్యార్థులు రోడ్డు ప్ర‌మాదంలో మ‌ర‌ణించారు. ఈ ఘ‌ట‌న మ‌ణిపూర్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.

- Advertisement -

యైరిపోక్‌లోని తంబ‌ల్ను హయ్య‌ర్ సెకండ‌రీ పాఠ‌శాల‌కు చెందిన కొంద‌రు విద్యార్థులు, సిబ్బందితో క‌లిసి స్ట‌డీ టూర్‌లో భాగంగా బుధ‌వారం ఉద‌యం రెండు బ‌స్సుల్లో ఖౌపుమ్ కు బ‌య‌లుదేరారు. నోనీ జిల్లాలోని బిస్నాపూర్‌-కౌపుమ్‌ రహదారి వద్దకు రాగానే ఓ బ‌స్సు అదుపు త‌ప్పి బోల్తా ప‌డింది. ఈ ఘ‌ట‌న‌లో 15 మంది విద్యార్థులు అక్క‌డిక్క‌డే ప్రాణాలు కోల్పోయారు.

స‌మాచారం అందుకున్న వెంట‌నే అధికారులు, పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్నాని స‌హాయ‌క చ‌ర్య‌లు మొద‌లుపెట్టారు. గాయ‌ప‌డిన విద్యార్థుల‌ను ఇంఫాల్‌లోని ప్రైవేట్ హెల్త్ కేర్ సెంట‌ర్ల‌కు త‌ర‌లించారు. మూల మ‌లుపు వ‌ద్ద బ‌స్సుపై డ్రైవ‌ర్ నియంత్ర‌ణ కోల్పోవ‌డంతో ఈ ప్ర‌మాదం చోటు చేసుకున్న‌ట్లు తెలుస్తోంది. విద్యార్థుల్లో మ‌రికొంద‌రి ప‌రిస్థితి విష‌మంగా ఉంది. దీంతో మృతుల సంఖ్య పెరిగే అవ‌కాశం ఉంది.

ఈ ఘ‌ట‌న‌పై మ‌ణిపూర్ ముఖ్యమంత్రి బీరెన్‌సింగ్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్య‌క్తం చేశారు. ప్ర‌మాద స్థ‌లికి ఎస్‌డీఆర్‌ఎఫ్‌, మెడికల్‌ సిబ్బందితో పాటు స్థానిక ఎమ్మెల్యే చేరుకుని సహాయక చర్యలు చేప‌ట్టిన‌ట్లు సోష‌ల్ మీడియా ద్వారా వెల్ల‌డించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News