Sunday, October 6, 2024
HomeతెలంగాణHusnabad: ఘనంగా ఎమ్మెల్యే పుట్టినరోజు

Husnabad: ఘనంగా ఎమ్మెల్యే పుట్టినరోజు

నియోజకవర్గ అభివృద్ధి, సంక్షేమమే పరమావధి

హుస్నాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ 58వ జన్మదినోత్సవం సందర్భంగా వేలాదిమంది కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, అభిమానుల మధ్య ఘనంగా పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. సెప్టెంబర్ 29వ తేదీ రాత్రి 12 గంటలు సమీపించగానే సెప్టెంబర్ 30 ఎమ్మెల్యే సతీష్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా వేలాది మంది కార్యకర్తలు, యువకులు, ప్రజాప్రతినిధులు, అభిమానుల మధ్యలో కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ప్రజా ప్రతినిధులు, అభిమానులు ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు తెలియజేసి గజమాలతో సత్కరించారు డప్పు చప్పులతో, టపాసులు కాలుస్తూ కోలాహలంగా వేడుకలు నిర్వహించారు.

- Advertisement -

ఎమ్మెల్యే సతీష్ కుమార్- షమితమ్మ దంపతులు హుస్నాబాద్ ఎల్లమ్మ తల్లిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. హుస్నాబాద్ నియోజకవర్గ వ్యాప్తంగా వివిధ శాఖల అధికారులు, బీఆర్ఎస్ పార్టీ అన్ని మండలాల నాయకులు, హుస్నాబాద్ మున్సిపాలిటీ నాయకులు, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, జెడ్పిటిసిలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, బీఆర్ఎస్ పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులు, నాయకులు వేలాదిగా తరలివచ్చి ఎమ్మెల్యే సతీష్ కుమార్ కు శుభాకాంక్షలు తెలియజేశారు.

బీఆర్ఎస్ నాయకులు, ఎమ్మెల్యే అభిమానులు దేవాలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు, రక్తదాన శిబిరాలు, స్కూల్లలో పిల్లలకు మిఠాయిలు పంచిపెట్టారు, హాస్పిటల్లలో రోగులకు పండ్లు అందించారు, అన్నదాన కార్యక్రమం, వివిధ సామాజిక కార్యక్రమాలలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సతీష్ కుమార్ మాట్లాడుతూ వారి పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలు, అభిమానులు, ప్రజాప్రతినిధులు తన పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు.

ఈ పుట్టినరోజు సందర్భంగా ఇంకా బాధ్యత పెరిగిందని హుస్నాబాద్ నియోజకవర్గంలోని ప్రతి గడప గడపకు ప్రభుత్వ అభివృద్ధి,సంక్షేమ పథకాలు అందుతున్నాయని ఇంకా విస్తృతంగా ప్రజలకు సేవ చేస్తానని, నియోజకవర్గంలో విద్య, వైద్యం, సంక్షేమం, ఉపాధి కల్పనల రంగంలో వేలకోట్లతో నిధులు తెచ్చి అభివృద్ధి పరిచానని, ఇటీవల హుస్నాబాద్ ఐఓసిని కూడా ప్రారంభించుకున్నామని అభివృద్ధి విషయంలో సహకరిస్తున్న ముఖ్యమంత్రి కెసిఆర్ కు, మంత్రులు కేటీఆర్ కు, హరీష్ రావులకు కృతజ్ఞతలు తెలియజేశారు. హుస్నాబాద్ నియోజకవర్గం కీర్తికిరీటంలో కలికితురాయి గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి చేశానని ఈ ప్రాజెక్టును త్వరలో సీఎం కేసీఆర్ చేతిలో మీదుగా ప్రారంభించి గోదావరి జలాలతో హుస్నాబాద్ నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News