Thursday, September 19, 2024
Homeనేషనల్Bengaluru: ఇంజనీరింగ్ స్టూడెంట్స్ పైత్యం.. పాకిస్థాన్ జిందాబాద్ నినాదాలు!

Bengaluru: ఇంజనీరింగ్ స్టూడెంట్స్ పైత్యం.. పాకిస్థాన్ జిందాబాద్ నినాదాలు!

- Advertisement -

Bengaluru: బెంగళూరులో ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థుల పైత్యపు చేష్టలు నగరంలో కలకలం రేపింది. కాలేజీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఇద్దరు విద్యార్థులు పాకిస్తాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేస్తుండగా మరో విద్యార్థి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇది కాస్త వైరల్ గా మారగా అసలు కాలేజీలో శత్రుదేశపు జిందాబాద్ నినాదాలు ఏంటి అంటూ గందరగోళం నెలకొని సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది.

న్యూ హారిజన్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ కాలేజీలో ఈనెల 25 , 26 తేదీలలో ఇంటర్ కాలేజీ ఫస్ట్ జరగనుంది. దానికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతుండగా.. ఇద్దరు విద్యార్థులు తమ అభిమాన ఐపీఎల్ క్రికెట్ జట్లకు అనుకూలంగా నినాదాలు చేస్తూ ‘పాకిస్థాన్ జిందాబాద్’ అరిచారు. ఇతర విద్యార్థులు అభ్యంతరం వ్యక్తం చేసి వారిని ఆపడానికి ప్రయత్నించి.. చివరికి వారిచేత జైహింద్, జై కర్ణాటక నినాదాలు చేయించారు.

ఈ మొత్తం ఘటనను మరో విద్యార్థి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది కాస్త వైరల్ గా మారగా.. మరోవైపు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆ ఇద్దరు విద్యార్ధులపై కేసు నమోదైంది. కర్ణాటక పోలీసులు వారిపై కేసు నమోదు చేయగా.. ఉద్దేశపూర్వకంగా నినాదాలు చేయలేదని బెయిల్ మంజూరు చేశారు. కేసు నమోదైన ఈ ఇద్దరు విద్యార్థులు మైనర్లే కాగా.. ఈ ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News