Sunday, October 6, 2024
HomeతెలంగాణKhammam: పలు కుటుంబాలకు నామా నాగేశ్వర రావు పరామర్శ

Khammam: పలు కుటుంబాలకు నామా నాగేశ్వర రావు పరామర్శ

ప్రజల్లో ఎంపీ

బీఆర్ఎస్ లోక్ సభా పక్ష నేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు అన్నపురెడ్డిపల్లి , పెనుబల్లి మండలాల్లో విస్తృతంగా పర్యటించి, పలు కుటుంబాలను పరామర్శించారు. అన్నపురెడ్డిపల్లి మండలం ఎర్రగుంటలో పార్టీ సీనియర్ నాయకులు బోయినపల్లి వెంకట సుబ్బారావు మృతి చెందగా దశ దిన కర్మ కార్యక్రమంలో పాల్గొన్నారు. సుబ్బారావు చిత్ర పటానికి పూల మాల వేసి, శ్రద్ధాంజలి ఘటించి, సంతాపం తెలిపి, నివాలర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి, ఓదార్చి, ధైర్యం చెప్పారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని దైవాన్ని ప్రార్ధించారు. తర్వాత పెనుబల్లి మండలం కొత్త కారాయి గూడెంలో మేడా మోహన్ రావు తండ్రి మేడా కృష్ణయ్య , ఎం. రామకృష్ణ మృతి చెందగా,చిత్ర పటాలకి పూల మాల వేసి, నివాలర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి, ఓదార్చారు. ఈ కార్యక్రమంలో రైతు బంధు జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు, పెనుబల్లి,చండ్రుగొండ, వైరా మండలాల పార్టీ అధ్యక్షులు కనగాల వెంకట్రావ్, దారా బాబు, బాణాల వెంకటేశ్వరరావు, పెనుబల్లి ఎంపీపీ లక్కినేని ఆలేఖ్య వినీల్, సర్పంచ్ లు దొడ్డపనేని శ్రీదేవి, చెన్నారావు, ఆళ్ల అప్పారావు, తావ్య నాయక్, లగడపాటి శ్రీను, అశోక్, చండ్రుగొండ మండల కార్యదర్శి ఉప్పునూతల ఏడుకొండలు, భూపతి శ్రీను, రసూల్, వీరబోయిన వేంకటేశ్వర్లు, పుల్లారావు, హరీష్, వెంకట నారాయణ, చిన్న పిచ్చయ్య, అంజన్ రావు, రాములు తో పాటు గొడ్డేటి మాధవరావు, వాకదాని కోటేశ్వరరావు, నామ సేవా సమితి నుంచి చీకటి రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News