Friday, September 20, 2024
HomeతెలంగాణLB Nagar: మార్నింగ్ వాక్ లో వాకర్స్ తో ముచ్చటించిన ఎమ్మెల్యే

LB Nagar: మార్నింగ్ వాక్ లో వాకర్స్ తో ముచ్చటించిన ఎమ్మెల్యే

ఇంకొక్క ఛాన్స్ ఇస్తే మరింత అభివృద్ధి-సుధీర్ రెడ్డి

గురువారం మార్నింగ్ వాక్ లో భాగంగా ఎల్.బి.నగర్ శాసనసభ్యులు, BRS పార్టీ అభ్యర్థి దేవిరెడ్డి సుధీర్ రెడ్డి మన్సూరాబాద్ డివిజన్ పరిధిలోని హరిణ వనస్థలి నందు పలువురు వాకర్స్ సభ్యులను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పలువురు వాకర్స్ మాట్లాడుతూ.. మా యొక్క మద్దతు ఎప్పుడు ఉంటుంది అని హామీ ఇచ్చారు. రాబోయే ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని తెలిపారు. ప్రస్తుతం ఉన్న యోగా షెడ్డు వెడల్పు చేయాలని, ఓపెన్ జిమ్స్ ఏర్పాటు చేయాలని కోరారు. దానికి గాను సుధీర్ రెడ్డి మాట్లాడుతూ.. గతంలో వాకింగ్ ట్రాక్ లో మీకు యోగా కోసం షెడ్డు మేమే వేయించామన్నారు. అయినా కూడా అదనపు షెడ్డు నిర్మాణం చేస్తామని హామీ ఇచ్చారు. ఓపెన్ జిమ్స్ కూడా ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఇది మన పార్క్ దీనిని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిమీద ఉందని గుర్తు చేశారు. నియోజకవర్గ పరిధిలోని ప్రధాన సమస్యలు పరిష్కారం చేస్తామన్నారు. ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయని వాటిని కూడా పరిష్కారిస్తామని తెలిపారు. నన్ను మరొక్కసారి ఆశీర్వదించి భారీ మెజారిటీతో నన్ను గెలిపించి నియోజకవర్గ అభివృద్ధికి తోడ్పడాలని సుధీర్ రెడ్డి కోరారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కొప్పుల విఠల్ రెడ్డి,డివిజన్ అధ్యక్షులు జక్కిడి మల్లారెడ్డి, మాజీ అధ్యక్షులు జగదీష్ యాదవ్, విజయ్ భాస్కర్ రెడ్డి, అశోక్ యాదవ్, భాస్కర్ యాదవ్, రాకేశ్, వాకర్స్ సభ్యులు విక్రమ్ రెడ్డి, విద్యాసాగర్ రావు, ఉపేందర్ రావ్, కృష్ణ గౌడ్, బిక్షపతి యాదవ్, మహేందర్ రెడ్డి, నరేందర్ గుప్తా, మల్లేష్, గోపి నాయక్, జగన్ రెడ్డి, మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News