Sunday, October 6, 2024
Homeపాలిటిక్స్'Defeat Modi':హిందూ గుడికెళ్తే 'సాఫ్ట్ హిందుత్వ'నా? ఇలాగైతే కాంగ్రెస్ గెలిచినట్టే ఏకే ఆంటోనీ ఆగ్రహం

‘Defeat Modi’:హిందూ గుడికెళ్తే ‘సాఫ్ట్ హిందుత్వ’నా? ఇలాగైతే కాంగ్రెస్ గెలిచినట్టే ఏకే ఆంటోనీ ఆగ్రహం

రానున్న 2024 పార్లమెంట్ ఎన్నికల్లో మోడీని, బీజేపీని ఓటమిపాలు చేయాలంటే దేశంలోని వారందరినీ కాంగ్రెస్ పార్టీ కలుపుకుని పోరాటం చేయాలంటూ కాంగ్రెస్ కురువృద్ధ నేత ఏకే ఆంటోని పార్టీ శ్రేణులకు హితబోధ చేశారు. దేశంలో మెజార్టీ ప్రజలు హిందువులు కాబట్టి జస్ట్ మైనరిటీస్ అంటే కుదరదని ఇద్దరినీ కలుపుకుని పోయినప్పుడే డిఫీట్ మోడీ సాధ్యమంటూ ఆంటోని అభిప్రాయపడ్డారు. ముస్లింలు మసీదుకు, క్రిస్టియన్లు చర్చులకు వెళ్తారని కానీ ఓ హిందువు గుడికి పోయి, కుంకుమ పెట్టుకుంటే సాఫ్ట్ హిందుత్వ అంటూ ముద్ర వేయటం దారుణమని ఆంటోని సొంత పార్టీపై కటువైన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇదే ధోరణిని కొనసాగిస్తే ఇది మోడీ విజయానికి కలిసొచ్చేలా చేస్తుందన్నారు. మోడీని ఓటమిపాలు చేసేందుకు మైనారిటీలతోపాటు మెజార్టీ వారిని కూడా కాంగ్రెస్ సపోర్ట్ చేయాలన్నారు. కేరళలోని తిరువనంతపురంలో కాంగ్రెస్ టాప్ లీడర్ ఏకే ఆంటోని చేసిన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ ప్రసంగం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. బీజేపీ ఐటీ సెల్ పనికట్టుకుని ఆంటోని మళయాళం స్పీచ్ ను వైరల్ చేస్తోంది కూడా.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News