Sunday, October 6, 2024
Homeనేరాలు-ఘోరాలుDelhi Car horror: గంటన్నర..20 కిలోమీటర్లు కారుతో ఈడ్చుకెళ్లి..ఉరే సరి..తల కొట్టేసినట్టైంది

Delhi Car horror: గంటన్నర..20 కిలోమీటర్లు కారుతో ఈడ్చుకెళ్లి..ఉరే సరి..తల కొట్టేసినట్టైంది

ఢిల్లీ కార్ హరర్ లో ఒక్కొక్కటే వెలుగులోకి వస్తున్న విషయాలు యావత్ దేశాన్ని షాక్ కు గురిచేస్తున్నాయి. కొత్త సంవత్సరంనాడు జరిగిన ఈ అత్యంత పాశవికమైన నేరానికి పాల్పడ్డవారికి ఉరే సరి అంటూ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. అసలు మన సమాజం ఎటెళ్తోందో అర్థం కావటం లేదని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. కాగా .. ఢిల్లీలో మహిళకు జరిగిన ఘోరమైన ఘటనతో తన తల కొట్టేసినట్టైందని ఢిల్లీ లెఫ్టనెంట్ గవర్నర్ వీకే సక్సేనా అన్నారు. బాధిత కుటుంబానికి మద్దతుగా నిలవాలంటూ సక్సేనా అన్నారు.

- Advertisement -

స్కూటీపై వెళ్తున్న ఓ అమ్మాయిని కారు ఢీ కొట్టి చంపిన కేసులో కొత్త షాకింగ్ ట్విస్టులు వెలుగులోకి వస్తున్నాయి. ఆదివారం తెల్లవారు జామున స్కూటీని ఢీ కొట్టిన కారు.. ఆమెను 18-20 కిలోమీటర్ల మేర అలాగే లొక్కెళ్లిందని, సుమారు గంటన్నరసేపు ఈ తతంగమంతా సాగినట్టు ప్రత్యక్ష సాక్షి పోలీసులకు వెళ్లడించాడు. బాధితురాలి ఒంటిపై బట్టలు లేక, వీపు భాగమంతా విపరీతంగా గాయాలపాలై దోక్కుపోయినట్టు, శరీర భాగాలు కూడా కొన్ని మిస్ అయ్యేంత ఘోరంగా ఆమెను వాహనంతా లాక్కెళ్లినట్టు తేలింది. అయితే తమ కారుకు ఆమె చిక్కుకున్న విషయాన్నే మేం చూడలేదంటూ కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు దుండగులు పోలీసులకు చెప్పినట్టు తెలుస్తోంది. తాము కారు విండోస్ క్లోజ్ చేసుకుని, పెద్ద సౌండ్ తో మ్యూజిక్ విన్నందుకు తమకు ఎటువంటి అరుపులు వినపడలేదని పోలీసులతో చెప్పారు. ఇదంతా పనికట్టుకుని చేసినట్టు సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయింది. అంతేకాదు అదేపనిగా ఆమెను కారుతో లాక్కెళ్లి, అక్కడక్కడే యు-టర్న్ తీసుకున్న 4-5 కిలోమీటర్లు తిరిగిన దృశ్యాలు కూడా రికార్డు అయ్యాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News