Friday, September 20, 2024
HomeNewsKuna Srisailam Goud: ప్రచారంలో దూసుకుపోతున్న కూన శ్రీశైలం గౌడ్

Kuna Srisailam Goud: ప్రచారంలో దూసుకుపోతున్న కూన శ్రీశైలం గౌడ్

పలు సంఘాల మద్దతు కూడగడుతున్న..

హెచ్.ఎం.టి గ్రౌండ్ లో వాకర్స్ ను కలిసి ఓటు అభ్యర్థించిన బీజేపీ అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్..వాకర్స్ తో సంభాషించిన గౌడ్ మీడియాతో మాట్లాడుతూ..రాష్ట్రంలో, కుత్బుల్లాపూర్ లో మార్పు కోరుకుంటున్నారన్నారు. కుత్బుల్లాపూర్ లో మీరే ప్రత్యామ్నాయం అంటూ ఆయనతో అన్న వాకర్స్..ఆశీస్సులు అందజేశారు అయ్యప్ప స్వాములు.

- Advertisement -

సుమారు 300 మంది ఆర్యవైశ్యులు హాజరై, కుత్బుల్లాపూర్ బిజెపి అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్ కి సంపూర్ణ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం వస్తే అన్ని వర్గాలకు న్యాయం జరగలేదని, బీజేపీ వస్తేనే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని అన్నారు. తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఆర్య వైశ్యుల కొరకు స్థలాన్ని కేటాయించడంతో పాటు, ప్రత్యేక భవనం ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. దేశంలో అయినా, రాష్ట్రంలో బీజేపీ ఉంటేనే ప్రజలు సుభిక్షంగా ఉంటారన్నారు.


ఈ కార్యక్రమంలో మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డా.ఎస్ మల్లారెడ్డి , జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు ప్రకాష్ గుప్తా, ఉప్పల చంద్రశేఖర్, సామ్రాజ్యలక్ష్మి, వెలగ శ్రీనివాస్, పోలిశెట్టి శ్రీనివాస్ గుప్తా, బిజెపి నిజాంపేట అధ్యక్షులు ఆకుల సతీష్ తదితరులు పాల్గొన్నారు. నిజాంపేట్ లో కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్లతో ప్రత్యేకంగా సమావేశమై ఈ ఎన్నికల్లో బిజెపికి మద్దతు ఇవ్వాలని కోరారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News