తెలంగాణలో సరికొత్త ప్రజా ప్రభుత్వం కొలువుదీరింది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రిగా భట్టీ విక్రమార్క ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ తమిళిసై వీరితో ప్రమాణ స్వీకారం చేయించారు. రేవంత్ తో పాటు 11 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర్ రాజనరసింహ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, దళసరి అనసూయ అలియాస్ సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి క్రిష్ణారావు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. సోనియాగాంధీ, మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సిద్ధరామయ్య వంటి కాంగ్రెస్ పెద్దలంతా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
CM Revanth Reddy Dep CM Bhatti: రేవంత్ రెడ్డి సీఎం, డిప్యుటీ సీఎం భట్టీ
కొలువుతీరిన నయా ప్రజాప్రభుత్వం
సంబంధిత వార్తలు | RELATED ARTICLES