Sunday, October 6, 2024
HomeతెలంగాణSudhir Reddy visited TIMS: టిమ్స్ నిర్మాణాన్ని పర్యవేక్షించిన సుధీర్ రెడ్డి

Sudhir Reddy visited TIMS: టిమ్స్ నిర్మాణాన్ని పర్యవేక్షించిన సుధీర్ రెడ్డి

26 అంతస్థుల ఆసుపత్రి

ఎల్బి.నగర్ నియోజకవర్గ పరిధిలోని చైతన్యపురి డివిజన్లో కొత్తగా నిర్మిస్తున్న టిమ్స్ హాస్పిటల్స్ పనులను ఎల్బి.నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా సుధీర్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ హాస్పిటల్ దాదాపు 26 అంతస్థులతో నిర్మాణం జరుగుతుందని తెలిపారు. భవిష్యత్తులో ఈ ప్రాంతంలో స్థలాలు దొరకడం కష్టంగా భావించి మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ ని ఒప్పించి పోలీస్ స్టేషన్, చిల్డ్రన్స్ పార్క్, సబ్ స్టేషన్, వాటర్ ట్యాంక్, ఒక అద్భుతమైన కమ్యూనిటి హాల్ కూడా నిర్మింస్తున్నట్టు వివరించారు. గుడి, మసీదు కూడా నిర్మిస్తామన్నారు.

- Advertisement -

హాస్పిటల్స్ వచ్చేవారు సేదతీరడానికి ప్రక్కనే అయిదు అంతస్థుల భవనం కూడా నిర్మిస్తున్నామన్నారు. ప్రస్తుతం 2 స్లాబుల నిర్మాణం పూర్తికాగా ప్రతి 25 నుంచి 30 రోజులకు ఒకసారి ఒక్కో స్లాబ్ నిర్మాణం జరుగుతుందని అన్నారు. నాణ్యత ప్రమాణాలు, తగిన భద్రత చర్యలు పాటిస్తూ పనులు పూర్తి చేయాలని ఆయన అధికారులను కోరారు.

ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ జిన్నారం విఠల్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, రామకృష్ణ, అధికారులు సుభాష్, రాజు, ఆశాజ్యోతి, పద్మాకర్, భాస్కర్ రెడ్డి, సంతోష్ కుమార్, గణేష్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News