Friday, September 20, 2024
Homeఆంధ్రప్రదేశ్Kurnool: హలో మాదాసి మదారి కురువ 'చలో ఆలూరు'

Kurnool: హలో మాదాసి మదారి కురువ ‘చలో ఆలూరు’

పార్టీలకతీతంగా తరలిరండి

కర్నూలు జిల్లా ఆలూరు తాలూకా హోళగుంద మండల మదాసి మదారి కురువ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాదాసి&మదారి కురువ సంఘం మండల గౌరవ అధ్యక్షుడు కాళిక ప్రసాద్, సలహాదారుడు శేషప్ప, ఎల్లార్తి సర్పంచ్ దర్గప్ప, ఎండి హళ్లి సర్పంచ్ సుధాకర్, మాదాసి కురువ ప్రధాన కార్యదర్శి కురువ మల్లయ్య మండల అధ్యక్షుడు పంపన్న మాట్లాడుతూ.. ఈనెల 24వ తేదీన ఆదివారం రోజున ఆలూరులో మదాసి మదారి కురువ మహా సింహ గర్జన కార్యక్రమం శశికళ కృష్ణమోహన్ గారి ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక నుంచి రాజ్యసభ సభ్యులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు భారీ స్థాయిలో పాల్గొంటారని, మదాసి&మదారి కురువలు భారి ఎత్తున పాల్గొనాలని, పార్టీలకతీతంగా ఈ కార్యక్రమానికి హాజరు అవ్వాలని, ఈ భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని, మదాసి కురువ మదారి కురువ కుల సర్టిఫికెట్ సాధన ధ్యేయంగా ఈ భారీ బహిరంగ సభ ద్వారా మనమందరం ముక్తకంఠంతో పిలుపునిచ్చే విధంగా కలిసికట్టుగా ఒకే నినాదంతో పనిచేయాలని అలాగే మనం అన్ని రకాలుగా రాజకీయంగా సాంఘికంగా ఆర్థికంగా అభివృద్ధి చెందే విధంగా ఈ భారీ బహిరంగ సభ తోడ్పాటు వస్తుందని కావున జిల్లా నలుమూలల నుంచి సోదరులు సోదరీమణులు భారీ ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని తెలియజేయజేశారు. ఈ కార్యక్రమంలో మండల సహాయ కార్యదర్శి ముద్దటమాగి గాదిలింగ, కోశాధికారి గర్జప్ప, ఎల్లార్తి శేషప్ప, సర్దార్, కమిటీ మెంబర్ సిద్ధప్ప, డాక్టర్ చంద్రశేఖర్, పేటప్ప, పెద్ద సిద్ధప్ప, పెద్ద బీరప్ప, పెద్దహ్యట అడివప్ప, సీనియర్ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News