Friday, September 20, 2024
Homeఆంధ్రప్రదేశ్Nara Bhuvaneswari @ Aluru: ఆలూరులో ఎగిరేది టీడీపీ జెండానే

Nara Bhuvaneswari @ Aluru: ఆలూరులో ఎగిరేది టీడీపీ జెండానే

నార భూవనేశ్వరిని కలిసిన వైకుంఠం శివప్రసాద్, జ్యోతి

ఎమ్మిగనూరులో నారా చంద్రబాబు సతిమణి నారా భువనేశ్వరి నిర్వహిస్తున్న నిజం గెలవాలి కార్యక్రమం ఎమ్మిగనూర్ లో నిర్వహించారు. ఈ సందర్బంగా ఆలూరు మాజీ టిడిపి ఇంఛార్జి వైకుంఠం శివప్రసాద్, జ్యోతిలు నారా భువనేశ్వరిని మర్యదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. ఆలూరు వచ్చే ఎన్నికల్లో టీడీపీ జెండా ఖాయమని ధీమా వ్యక్తంచేశారు.
రానున్న ఎన్నికల్లో టిడిపి ప్రభుత్వ ఏర్పాటుకు అందరూ కృషి చేయాలని నారా భువనేశ్వరి సూచించినట్లు వారు తెలిపారు. ఈ సందర్భంగా వైకుంఠం దంపతులు వైకుంఠం శివ ప్రసాద్, వైకుంఠం జ్యోతి మాట్లాడుతూ గతంలో టీడీపీ హయాంలో రాష్ట్రం అని విధాలుగా అభివృద్ధి చెందిందని వారు తెలిపారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి అభివృద్ధి మరిచి బటన్లు నొక్కడం తప్పా ఎలాంటి అభివృద్ధి చేయాలేదని విమర్శించారు. రాష్ట్ర అభివృద్ధి టీడీపీ తోనే సామవుతుందని వారు తెలిపారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ విజయం సాధిస్తుందని వారు జోస్యం చెప్పారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News