Friday, September 20, 2024
Homeనేరాలు-ఘోరాలుTandur: పందెం రాయుళ్లపై కేసు

Tandur: పందెం రాయుళ్లపై కేసు

బెన్నూరులో కోడి పందాలు

వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గంలోని యాలాల మండలం, బెన్నూర్ గ్రామ సమీపంలో కాగ్న వాగు పంప్ హౌస్ దగ్గర కోడి పందాలు నిర్వహిస్తున్నారనే పక్కా సమాచారంతో వికారాబాద్ జిల్లా టాస్క్ఫోర్స్ ఎస్సై ప్రశాంత్ వర్ధన్ బృందం, యాలాల స్థానిక ఏఎస్ఐ యాదయ్యతో కలిసి దాడి చేయగా అక్కడ కోడి పందాలు నిర్వహిస్తున్న తొమ్మిది మందిని, రెండు కోళ్లను, 16,320/- రూపాయల నగదు, ఎనిమిది సెల్ఫోన్లను స్వాధీనం చేసుకొని యాలాల పోలీస్ స్టేషను తరలించడం జరిగిందని పోలీసులు తెలిపారు. పందెం రాయుళ్లపై కేసు నమోదు చేసినట్టు తెలిపారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ… ప్రభుత్వ నిబంధనను ఉల్లంఘిస్తూ కోడిపందాలు నిర్వహిస్తున్న వారిపై కేసులు నమోదు చేస్తామన్నారు. తాండూరు నియోజకవర్గంలోని యాలాల, బషీరాబాద్, పెద్దేముల్, తాండూరు మండలాలలో ఎక్కడ కోడిపందాలు నిర్వహిస్తున్నా పోలీసులకు సమాచారం అందించాలని, వారి పేర్లను గోప్యంగా ఉంచుతామన్నారు. గ్రామస్తులు ప్రజాప్రతినిధులు పోలీసులకు సహకరించాలని కోరారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News