Thursday, September 19, 2024
Homeనేరాలు-ఘోరాలుMissing: మిస్ అయి 50 రోజులు.. అయినా కానరాని అసిస్టెంట్ లోకో పైలట్ ఆచూకి

Missing: మిస్ అయి 50 రోజులు.. అయినా కానరాని అసిస్టెంట్ లోకో పైలట్ ఆచూకి

మహిళా అసిస్టెంట్ లోకో పైలట్ వాసవి ప్రభ ఆచూకి ఇప్పటికీ తెలియరాలేదు. వాసవి మిస్ అయి 50 రోజులు కావస్తోంది..దీంతో ఆమె తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. తమ కూతురు వాసవి ప్రభ (26) సనత్ నగర్ రైల్వే స్టేషన్ లో అసిస్టెంట్ లోకో పైలట్ గా విధులు నిర్వహిస్తోందని.. డిసెంబర్ 11న సంచిత్ సాయి అనే వ్యక్తితో ఆమెకు వివాహం నిశ్చయించినట్టు తెలిపారు. వాసవి షాపింగ్ కూడా పూర్తి చేసిందని పేరెంట్స్ చెబుతున్నారు. నవంబర్ 30వ తేదీ నుంచీ కనబడకపోవడంతో సనత్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
అసిస్టెంట్ లోకో పైలట్ వాసవి ప్రభ ఆచూకీ తెలిపిన వారికి తగిన బహుమతి అందిస్తామని సనత్ నగర్ పోలీసులు ప్రకటించారు. వాసవి తన వస్తువులు అన్నీ ఇంట్లోనే వదిలి వెళ్లడం వలన ఆమెను ట్రేస్ చేయడం ఆలస్యం అవుతోందని.. ఇప్పటికే ఆమె బ్యాంకు ట్రాన్సాక్షన్స్, సోషల్ మీడియా అకౌంట్స్ చెక్ చేసిన ఎటువంటి సమాచారం అందలేదని..పోలీసు బృందాలు ఆమె కోసం వెతుకుతున్నాయని సనత్ నగర్ పోలీసులు తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News