Friday, September 20, 2024
HomeతెలంగాణCongress: ఉద్యోగులది, కాంగ్రెస్ ది విడదీయలేని బంధం

Congress: ఉద్యోగులది, కాంగ్రెస్ ది విడదీయలేని బంధం

పాల్గొన్న మధు యాష్కి, కోదండరాం

స్వరాష్ట్రము సిద్దించిన తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఉద్యోగుల పట్ల చూపిస్తున్న శ్రద్ద, తీసుకుంటున్న నిర్ణయాలను తెలంగాణ రాష్ట్ర “పొరుగు సేవల ఉద్యోగులు” అభినందనలు తెలియజేస్తున్నారు.

- Advertisement -

సంవత్సరాలనుండి పరిష్కారం కానీ సమస్యలు కూడ పరిష్కరింస్తున్నామని కాంగ్రెస్ వెల్లడించింది. మాజీ ఎం.పీ. టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి గౌడ్ ని ముఖ్య అతిధిగా పొరుగు సేవల ఉద్యోగులు ఈ రోజు రవీంద్ర భారతి ఆడిటోరియం లొ రాష్ట్ర స్థాయి ఆత్మీయ సభ నిర్వహించుకున్నారు.

రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థులను గెలిపించాలని ఈసందర్బంగా మధు యాష్కి గౌడ్ కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జనసమితి అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం, టీపీసీసీ ప్రచార కమిటీ కన్వీనర్ తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ ఐ ఎన్ టి యు సి జాతీయ నాయకులు ఆర్ డి చంద్రశేఖర్ వెంకటేశ్వర రెడ్డి, తెలంగాణ జన సమితి హైదరాబాద్ ప్రెసిడెంట్ ఎం నరసయ్య గౌడ్, అగ్రికల్చర్ యూనివర్సిటీ ప్రొఫెసర్ సౌజన్య, తెలంగాణ రాష్ట్ర హౌసింగ్ ఉద్యోగస్తుల జేఏసీ ప్రెసిడెంట్ పులి లక్ష్మయ్య , కాళోజి టీవీ చైర్మన్ దాసరి శ్రీనివాస్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News