Friday, September 20, 2024
Homeనేరాలు-ఘోరాలుHyd: రూ. 83,00,000 బంగారు నగలతో ఉడాయించిన బంగారు వ్యాపారి

Hyd: రూ. 83,00,000 బంగారు నగలతో ఉడాయించిన బంగారు వ్యాపారి

హైదరాబాదు నగరంలో ఓ బంగారు వ్యాపారి చేసిన భారీ మోసం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రూ. 83,00,000 బంగారు నగలతో ఉడాయించిన బంగారు వ్యాపారి మోసంతో బాధితులు లబోదిబోమంటున్నారు. హైదరాబాద్ బషీర్బాగ్ లోని శ్రీయాష్ జ్యూవెల్లర్స్ యజమాని ఆనంద్ కుమార్.. కోటి రూపాయల విలువ చేసే బంగారాన్ని ఆభరణాల తయారీకి ఇచ్చాడు. ఆభరణాల తయారీ కోసం బంగారం తీసుకున్న గణేష్ చంద్ర దాస్.. తిరిగి ఇవ్వలేదు. దీంతో ఆభరణాలు తయారు చేసే గణేష్ చంద్ర దాస్ షాప్ కి వెళ్లి చూడగా పరారీలో ఉన్నాడు. బాధిత యజమాని నారాయణ గూడ పోలీసులకు పిర్యాదు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News