Saturday, October 5, 2024
Homeనేరాలు-ఘోరాలుయూపీలో శ్రద్ధ తరహా హత్య.. మాజీ ప్రియురాలిని ఆరుముక్కలుగా నరికిన ఉన్మాది

యూపీలో శ్రద్ధ తరహా హత్య.. మాజీ ప్రియురాలిని ఆరుముక్కలుగా నరికిన ఉన్మాది

దేశరాజధాని ఢిల్లీలో శ్రద్ధ హత్య కేసు వెలుగుచూసిన తర్వాత.. అలాంటి ఉదంతాలు ఒక్కొక్కటిగా బయటికొస్తున్నాయి. నాలుగురోజుల క్రితం బంగ్లాదేశ్ లో హిందూ యువతిని ఆమె ముస్లిం ప్రియుడు నరికి చంపిన ఘటన వెలుగుచూసింది. తాజాగా నేరాలకు నెలవైన ఉత్తరప్రదేశ్ లో శ్రద్ధ తరహా హత్యకేసు మరోకటి బయటపడింది. నవంబర్ 15వ తేదీన వెలుగుచూసిన ఈ హత్యకేసుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

- Advertisement -

అతని పేరు ప్రిన్స్ యాదవ్. తనను ప్రేమించి.. మరొకరిని పెళ్లాడిందన్న కోపంతో.. మాజీ ప్రియురాలిని చంపేసి.. ఆరుముక్కలుగా నరికేశాడో ఉన్మాద ప్రియుడు. ఆజంగఢ్ జిల్లాలోని పశ్చిమి గ్రామంలో కుటుంబంతో కలిసి జీవిస్తుంటారు. తాను ప్రేమించి.. శారీరకంగా దగ్గరైన యువతి ఆరాధన.. తనను కాదని మరొకరిని పెళ్లాడటాన్ని జీర్ణించుకోలేకపోయాడు. మాట్లాడాలని పిలిచి.. ఈ నెల 9న ఆమెను బైక్‌పై గుడికి ఎక్కించుకుని వెళ్లాడు. ఆ తర్వాత సమీపంలోని చెరకు తోటలోకి తీసుకెళ్లి.. చంపేశాడు. అందుకు అతని కుటుంబ సభ్యులు కూడా సహకరించడం గమనార్హం. నవంబర్ 15న పశ్చిమి గ్రామంలోని ఓ వ్యవసాయ బావిలో గుర్తుతెలియని ముక్కలుగా నరకబడిన మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు.

ఘటనా ప్రాంతానికి వెళ్లిన పోలీసులు.. మృతదేహాన్ని వెలికితీసి.. పోస్టుమార్టమ్ కు తరలించారు. ట్విస్ట్ ఏంటంటే ఆ మృతదేహానికి సంబంధించిన తల అక్కడ లేదు. ప్రాథమిక విచారణలో ప్రిన్స్ యాదవ్ నిందితుడని తేలింది. దాంతో అతడిని అరెస్ట్ చేసి విచారణ చేయగా.. తలను మరో ప్రాంతంలోని చెరువులో విసిరేసినట్లు చెప్పాడు. దాంతో తల కోసం ఆ చెరువు ఉన్న ప్రాంతానికి యాదవ్ ను తీసుకెళ్లారు.

ఈ క్రమంలో అతను తప్పించుకునే ప్రయత్నం చేయగా.. పోలీసులు కాల్పులు జరిపారు. యాదవ్ కాలికి బుల్లెట్ తగిలి గాయమైంది. ప్రేమించిన తనను కాదని మరో వ్యక్తిని పెళ్లాడిందన్న కోపంతోనే ఈ హత్య చేశానని నిందితుడు అంగీకరించాడు. తన సోదరుడు సర్వేష్ తో కలిసి చెరుకు తోటలో మాజీ ప్రియురాలిని చంపి, శవాన్ని ఆరు ముక్కలు చేసినట్లు తెలిపాడు. నిందితుడి కాలికి బుల్లెట్ గాయం కావడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News