Sunday, October 6, 2024
Homeపాలిటిక్స్Kukatpally: అభివృద్ధి కార్యక్రమాలతో బిజీగా మాధవరం కృష్ణారావు

Kukatpally: అభివృద్ధి కార్యక్రమాలతో బిజీగా మాధవరం కృష్ణారావు

దేశానికి వెన్నుముక యువతని… యువతను తప్పుదారి పట్టిస్తున్న కొన్ని అరాచక శక్తులను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించ వద్దని..కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. యువతను దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్ లో అంతర్జాతీయ స్థాయి కంపెనీలను కేసీఆర్, కేటీఆర్ తీసుకువచ్చి ఉపాధి కల్పిస్తున్నారు కృష్ణారావు కొనియాడారు. వెంకట్రావు నగర్ కమ్యూనిటీ హాల్లో కూకట్పల్లి యువత ఆత్మీయ సమ్మేళనంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం కూకట్పల్లి నియోజకవర్గం కెపిహెచ్బి డివిజన్ లో కోటి 25 లక్షల రూపాయలతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఇందులో ప్రధానంగా మహాత్మా గాంధీ పార్కులో అభివృద్ధి పనులు మరియు బుద్ధ వర్టెక్స్ దగ్గర సీసీ రోడ్డు పునరుద్ధరణ పనులు …అలాగే శిల్పా ఎవెన్యూ నందనవనం పార్కు అభివృద్ధి పనులకు శంకుస్థాపన నిర్వహించారు. కేపీహెచ్బీ డివిజన్లోని పార్కుల కోసం ఇప్పటికే పెద్ద ఎత్తున నిధులు కేటాయించామన్నారు. అన్ని ప్రాంతాల వారు నివసించే ఈ కుకట్పల్లి నియోజకవర్గం ప్రజలు చాలా సంతృప్తిగా ఉన్నారన్నారు. ఎవరికైనా మౌలిక సదుపాయాలు అందే విషయంలో ఎటువంటి ఇబ్బంది ఉన్నా నేరుగా తమ కార్యాలయాన్ని సంప్రదించాలన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News