Friday, September 20, 2024
Homeనేషనల్Budget sessions: భారత బడ్జెట్ వైపే ప్రపంచం చూపు-మోడీ

Budget sessions: భారత బడ్జెట్ వైపే ప్రపంచం చూపు-మోడీ

ప్రపంచమంతా భారత్ బడ్జెట్ వైపు చూస్తోందంటూ ప్రధాని నరేంద్ర మోడీ ఆసక్తికరమైన ప్రకటన చేశారు. సభ సజావుగా సాగేందుకు సభ్యులంతా సహకరించాలని మోడీ విజ్ఞప్తి చేశారు. ఇండియా ఫస్ట్, సిటిజన్ ఫస్ట్ ను తాము పాటిస్తున్నట్టు ప్రధాని వెల్లడించారు. బడ్జెట్ సమావేశాలకు ముందే సానుకూల అంచనాలు పలు ప్రపంచ సంస్థల నుంచి అందుతుండటం విశేషం అని ప్రధాని పేర్కొన్నారు.

- Advertisement -

మనందరి అంచనాలను ఆర్థిక మంత్రి నిర్మలా జీ అందుకుంటారనే ఆశాభావాన్ని ప్రధాని వ్యక్తంచేశారు. ప్రతి అంశంపై సభలో మంచి చర్చలు జరపనున్నట్టు ఆయన తెలిపారు. ఎంపీలంతా పూర్తి సన్నద్ధతతో సమావేశాల్లో పాల్గొంటున్నారని, ఈ సమావేశాలు అత్యంత కీలకమైనవంటూ మోడీ నొక్కి చెప్పారు. ప్రపంచంలో నెలకొన్న ఆర్థిక అనిశ్చితి నేపథ్యంలో మన బడ్జెట్ సమావేశాలు అత్యంత ప్రధాన్యతను సంతరించుకున్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News