Friday, September 20, 2024
Homeనేరాలు-ఘోరాలుPak terror: పాక్ ఆత్మాహుతి దాడిలో 83కు చేరిన మృతుల సంఖ్య

Pak terror: పాక్ ఆత్మాహుతి దాడిలో 83కు చేరిన మృతుల సంఖ్య

పాకిస్థాన్ లోని పెషావర్ నగరంలోని మసీదులో నిన్న జరిగిన ఆత్మాహుతి దాడి మృతుల సంఖ్య 83కి చేరింది. కాగా ఈ సంఖ్య మరింత పెరిగే సూచనలు ఇప్పటికీ ఉన్నాయి. ఆత్మాహుతి ధాటికి మసీదులోని ఓవైపు భాగం కుప్పకూలగా శిథిలాల కింద చిక్కుకుపోయిన మృతదేహాలను ఈరోజు వెలికి తీస్తున్నారు. ఈ దాడిలో 150 మందికి పైగా గాయపడ్డారు. వీరిలో కొందరి పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. ఆఫ్ఘనిస్తాన్ బార్డర్ లోని పెషావర్ లో మిలిటెన్సీ తీవ్రత ఎక్కువగా ఉండగా తాలిబన్లు కక్ష తీర్చుకునేందుకు ఈ దాడికి పాల్పడ్డారు. మరోవైపు పాకిస్థాన్ లో శాంతి భద్రతలు అత్యంత అధ్వాన్న స్థితికి చేరుకున్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News