Sunday, October 6, 2024
HomeతెలంగాణAndole: ఆసుపత్రికి మంత్రి రాజనర్సింహ భూమి పూజ

Andole: ఆసుపత్రికి మంత్రి రాజనర్సింహ భూమి పూజ

30 పడకల ఆసుపత్రి భవనానికి..

ఆందోల్ నియోజకవర్గంలోని వట్టిపల్లి మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ మండల కేంద్రంలో 11 కోట్ల 20 లక్షల రూపాయల నిధులతో 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. ఆనంతరం మండల కేంద్రంలో ఉన్న సేవాలల్ మహరాజ్ విగ్రహానికి పూలమాలలు వేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

- Advertisement -

వట్పల్లి మండల కేంద్రంలో ఉన్న ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం వెంకట ఖాజా దర్గాను దర్శించటానికి మంత్రి దామోదర్ రాజనర్సింహ పాదయాత్రగా వచ్చి దర్గాలో చాదర్, గంధం సమర్పణ చేసి ప్రార్థనా కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం దర్గాలోని లంగర్ లో ప్రజలందరితో కలిసి సహపంక్తి భోజనం చేశారు.

ఈ కార్యక్రమంలో వట్టిపల్లి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు రమేష్ జోషి, సంగమేశ్వర్ పాటిల్, వినయ్ గౌడ్, అరవింద్, ప్రశాంత్, పార్టీ నాయకులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News