Friday, September 20, 2024
Homeనేరాలు-ఘోరాలుGarla: ఇద్దరు చిన్నారుల అనుమానాస్పద మృతి

Garla: ఇద్దరు చిన్నారుల అనుమానాస్పద మృతి

పరారీలో తల్లిదండ్రులు!

గార్ల మండల పరిధిలోని అంకన్న గూడెం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. అనిల్ దేవి దంపతులకు ఇద్దరు చిన్నారులు లాస్య (12నెలలు), లోహిత (2నెలలు) అనుమానాస్పద రీతిలో మృతిచెందారు. వారు తాగే పాలలో విషం కలిపి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తల్లిదండ్రులు ఇద్దరు పరారీలో ఉండటం ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

- Advertisement -

వివరాల్లోకి వెళితే.. బయ్యారం మండలం నామాలపాడులో అనిల్, దేవి తమ పిల్లలతో కలిసి ఉంటున్నారు. వారం క్రితం అనిల్ తమ స్వగ్రామం అంకన్నగూడెంకు కుటుంబంతో కలిసి వచ్చాడు. అతడి తండ్రి వెంకన్న స్థానికంగా కిరాణా దుకాణం నిర్వహిస్తున్నాడు. ఆదివారం తెల్లవారుజామున షాపునకు వెళ్లిన వెంకన్న.. తిరిగి 10 గంటలకు ఇంటికి చేరుకున్నాడు. అప్పటికే ఇంట్లో చిన్నారులు విగతజీవులుగా పడి ఉన్నారు. కుమారుడు, కోడలు కనిపించలేదు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి డిఎస్పి తిరుపతి సిఐ రవికుమార్ ఎస్ఐ జీనత్ కుమార్ లు చేరుకుని పరిశీలించారు చిన్నారుల తాత వెంకన్న ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ జీనత్ కుమార్ తెలిపారు. చిన్నారుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మహబూబాద్ ఏరియా హాస్పిటల్ కు తరలించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News