Friday, October 18, 2024
Homeఆంధ్రప్రదేశ్Srisailam: జన ఆత్మీయుల మధ్య శిల్పా నామినేషన్

Srisailam: జన ఆత్మీయుల మధ్య శిల్పా నామినేషన్

మీకు న్యాయం జరిగితే నాకు ఓటేయండి

శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి జన ఆత్మీయుల మధ్య జై జగన్ జై శిల్పా నినాదాలతో భారీ జన సందోహం మధ్య నామినేషన్ వేశారు. ముందుగా శిల్పా చక్రపాణి రెడ్డి పార్టీ ఆఫీసులో వేద పండితులతో ఆశీర్వాద ములు అందుకొని ముహూర్త సమయానికి నాయకులు కార్యకర్తలతో భారీగా ఆత్మకూరు పట్టణ సెంటర్ కు చేరుకున్నారు. అక్కడి నుండి శిల్పా చక్రపాణి రెడ్డి నంద్యాల ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డి శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి బుడ్డా శేషి రెడ్డి తాసిల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు. అనంతరం రిటర్నింగ్ అధికారి నామినేషన్ పత్రాలు అందజేశారు.

- Advertisement -

మీడియాతో మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో ఆ దేవుని ఆశీస్సులతో ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేశానని శిల్పా చక్రపాణి రెడ్డి అన్నారు. శిల్ప అభిమానులకు జగన్మోహన్ రెడ్డి అభిమానులకు కార్యకర్తలకు అందరికీ ముందుగా కృతజ్ఞతలు తెలిపారు. తెలుగుదేశం పార్టీ అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మరని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ఒకటే వివరిస్తున్నారని, మీ కుటుంబానికి ఏమైనా న్యాయం జరిగి ఉంటే మాకు ఓటు వేయమని అంటున్నారని తెలిపారు.

తెలుగుదేశం పార్టీ వారు 14 సంవత్సరాలు ప్రజలకు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చి రైతులను దగా చేసి నిరుద్యోగ భృతి ఇవ్వకుండా మోసం చేసిన పార్టీ తెలుగుదేశం అని అన్నారు. చంద్రబాబు నాయుడు .పవన్ కళ్యాణ్ పురందేశ్వరి .ఎన్ని జిమ్మిక్కులు చేసినా అధికారంలోకి రావడం కల్లే అని తెలిపారు. వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో ఎంతోమంది లబ్ధి పొందుతున్నారని, పిల్లల భవిష్యత్తు తీర్చిదిద్ది వారికి తోడుగా జగన్మోహన్ రెడ్డి అండగా ఉన్నారని అన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలన్నీ ప్రతి పేదవాడికి అందేలా చేసి తూచా తప్పకుండా ప్రతి ఒక్కరికి న్యాయం చేశారని తెలిపారు. కులమత బేధం లేకుండా జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు అందించారని అన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News