Saturday, April 19, 2025
HomeతెలంగాణKhammam: నామినేషన్ వేసిన నామా

Khammam: నామినేషన్ వేసిన నామా

బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా..

ఖమ్మం లోకసభ నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థిగా నామ నాగేశ్వరరావు నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ వీ.పీ.గౌతంకు తన నామినేషన్ పత్రాలు అందజేశారు. నామ ప్రస్తుతం ఎంపీగా, లోకసభలో బీఆర్ఎస్ పక్ష నేతగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. నామినేషన్ పత్రాలు దాఖలు చేస్తున్న సందర్భంగా ఎంపీ నాగేశ్వరరావుతో పాటు రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, డాక్టర్ బండి పార్థసారథి రెడ్డి,మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యలు ఉన్నారు.

- Advertisement -

ఈ సందర్భంగా ఎంపీ నామ రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్సీ తాతా మధు, మాజీ ఎమ్మెల్యేలు బానోతు మదన్ లాల్, కందాళ ఉపేందర్ రెడ్డి తదితర ప్రముఖులతో కలిసి కలెక్టరేట్ చేరుకున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News