Saturday, May 18, 2024
Homeఆంధ్రప్రదేశ్Mantralayam: అట్టహాసంగా బాలనాగిరెడ్డి నామినేషన్

Mantralayam: అట్టహాసంగా బాలనాగిరెడ్డి నామినేషన్

రాఘవేంద్ర స్వామిని దర్శించుకుని..

అశేష జనవాహిని మధ్య వైయస్సార్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వై బాలనాగిరెడ్డి అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేశారు. ముందుగా గ్రామ దేవత మంచాలమ్మను, శ్రీ రాఘవేంద్ర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వైఎస్సార్సీపీ అభ్యర్థి వై బాలనాగిరెడ్డితో పాటు టిటిడి బోర్డు సభ్యులు వై సీతారామరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు జి భీమిరెడ్డి, విశ్వనాథ్ రెడ్డి ఉన్నారు. అనంతరం మంత్రాలయం నియోజకవర్గం నుంచి అన్ని మండలాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన వైసిపి శ్రేణులు, అభిమానులు, అనుచరుల కార్యకర్తలతో కలిసి పెద్ద ఎత్తున తాహసిల్దార్ కార్యాలయం వరకు వై బాలనాగిరెడ్డి ఊరేగింపు వెళ్లి నామినేషన్ వేయడం జరిగింది. డిఎస్పి సీతారామయ్య ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోలిసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News