Friday, October 18, 2024
HomeతెలంగాణThalakondapalli: గ్రామాల సుస్థిర అభివృద్ధి మోడీతోనే సాధ్యం

Thalakondapalli: గ్రామాల సుస్థిర అభివృద్ధి మోడీతోనే సాధ్యం

పార్లమెంటు అభ్యర్థి భారత్ ప్రసాద్

మోసపూరిత హామీలతో తెలంగాణలో గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీని తరిమికొట్టాలని చేతగాని హామీలతో పబ్బం గడుపుతున్న కాంగ్రెస్ పార్టీపై మాజీ జాతీయ బీసీ కమిషన్ మెంబర్ తల్లోజు ఆచారి, నాగర్‌కర్నూల్ పార్లమెంటు బిజెపి పార్టీ అభ్యర్థి పోతుగంటి భరత్ ప్రసాదులు కాంగ్రెస్ పార్టీపై ధ్వజమెత్తారు. తలకొండపల్లి మండలంలో పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో పలు గ్రామాలలో బిజెపి పార్టీ నాయకులు రోడ్ షో నిర్వహించారు. మండలంలోని గట్టుఇప్పలపల్లి, మెదక్ పల్లి, రాంపూర్, చంద్రదన, తలకొండపల్లి, పడకల్ తదితర గ్రామాలలో పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో భాగంగా మాజీ జాతీయ బిసి కమిషన్ మెంబర్ తల్లోజు ఆచారి, బిజెపి నాయకులతో కలిసి నాగర్‌కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థి పోతుగంటి భరత్ ప్రసాద్‌ మండలంలో సుడిగాలి పర్యటన చేశారు.

- Advertisement -

ఆయా గ్రామాలలో ఏర్పాటుచేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముచ్చటగా మూడవ సారి మళ్లీ ప్రధానమంత్రి అయితేనే భారతదేశం అభివృద్ధి బాటలో ప్రయాణిస్తుందన్నారు. పల్లెలు, గ్రామాలు అభివృద్ధి బాటలో నడుస్తున్నయంటే అది బిజెపి ఘనతనేనని వారు పేర్కొన్నారు. ముస్లింలకు ట్రిపుల్ తాలక్ చట్టాన్ని రద్దుచేసి ముస్లిం అమ్మాయిలకు స్వేచ్ఛ హక్కులను కల్పించి గొప్ప చట్టాన్ని తీసుకొచ్చిన ఘనత మోడీ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు.

రిజర్వేషన్ కల్పించడం తప్ప వాటిని రద్దు చేసే పార్టీ బిజెపి కాదన్నారు.రాజ్యాంగాన్ని పరిరక్షణ చేసేది బిజెపి ప్రభుత్వం అన్నారు. ఈ కార్యక్రమంలో కల్వకుర్తి అసెంబ్లీ బీజేవైఎం కన్వీనర్ పద్మ అనిల్, తలకొండపల్లి మండల అధ్యక్షుడు రవి గౌడ్, బిజెపి జిల్లా కార్యవర్గ సభ్యులు షానమోని పాండు ప్రసాద్, బిజెపి పార్టీ సీనియర్ నాయకులు భక్కి కుమార్, పోతుగంటి మహేష్, శ్రీనివాస్ చారి, పెద్ద హరిమోహన్ రెడ్డి, శేఖర్ రెడ్డి, వినోద్, మహేష్, ప్రవీణ్, కటికల వెంకటయ్య, మధు యాదవ్, సుధాకర్, శ్రీకాంత్, యాదగిరి, మహేష్ తదితరులు ఉన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News