Friday, September 20, 2024
HomeతెలంగాణKarimnagar: ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలి

Karimnagar: ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలి

కలెక్టర్ పమేలా సత్పతి

పార్లమెంట్ ఎన్నికల్లో 18 సంవత్సరాలు దాటిన వారందరూ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పేర్కొన్నారు. కరీంనగర్ లోని సుభాష్ నగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ సందర్శించారు. ఇక్కడ ఓటు హక్కు వినియోగించుకున్న ట్రాన్స్ జెండర్లతో మాట్లాడారు.

- Advertisement -

అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పార్లమెంట్ పరిధిలో ఉన్న ట్రాన్స్ జెండర్లంతా ఓటు హక్కును వినియోగించుకునేలా చూడాలని సూచించారు. దివ్యాంగులు, వయోవృద్ధులు ఇబ్బందులు పడకుండా వీల్ చైర్లు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. వారికి ప్రత్యేక వసతులు కల్పించాలని సూచించారు. పార్లమెంట్ పరిధిలో పోలింగ్ సజావుగా సాగుతున్నదని తెలిపారు. ఈ మేరకు పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టామని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో డి ఆర్ డి ఓ శ్రీధర్, మెప్మా పీడీ రవీందర్, జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి, స్వీప్ నోడల్ అధికారి రామాచారి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News