Saturday, September 28, 2024
HomeతెలంగాణRamadugu: రామడుగు మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు గోల్లె రామస్వామి

Ramadugu: రామడుగు మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు గోల్లె రామస్వామి

జర్నలిస్టుల సమస్యలపై పోరాడుతా..

రామడుగు మండల ప్రెస్‌క్లబ్‌ అధ్యక్షుడిగా గోల్లె రామస్వామి మంగళవారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గౌరవ అధ్యక్షుడిగా కాసారపు తిరుపతి గౌడ్, ముఖ్య సలహాదారులుగా వంచ రాజిరెడ్డి, గంటే భాస్కర్ , ప్రధాన కార్యదర్శిగా పంజాల వెంకటేష్ గౌడ్ ,ఉపాధ్యక్షుడి గా ఒడ్నాల గంగరాజు ,కోశాధికారిగా ఎం. డి సాబుద్దిన్,లతో పాటు కార్యవర్గ సభ్యులుగా పూరెళ్ల రవీందర్ గౌడ్ లు ఎన్నికయ్యారు. ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు అభినందించారు.

- Advertisement -

ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రామస్వామి మాట్లాడుతూ… ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ తమ పత్రికల ద్వారా నిత్యం ప్రజలను చైతన్యవంతులను చేసే పత్రిక విలేకరుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానన్నారు. ప్రభుత్వపరంగా రావలసిన రాయితీలను ఇప్పించడంలో ప్రత్యేక దృష్టి సారిస్తానని అన్నారు. తనపై నమ్మకంతో తనను ఏకగ్రీవంగా ఎన్నిక చేసిన ప్రెస్ క్లబ్ సభ్యులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News