Saturday, October 5, 2024
HomeతెలంగాణThangallapalli: మండలంలో బీజేపీ శ్రేణుల సంబురాలు

Thangallapalli: మండలంలో బీజేపీ శ్రేణుల సంబురాలు

బండి గెలుపు ఉత్సవాలు..

రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండల కేంద్రంలో ఎంపీ బండి సంజయ్ భారీ మెజార్టీతో గెలుపొందిన సందర్భంగా బిజెపి పార్టీ మండల అధ్యక్షుడు వెన్నమనేని శ్రీధర్ రావు ఆధ్వర్యంలో బిజెపి శ్రేణులు స్వీట్లు పంపిణీ చేసి, టపాసులు పేల్చి సంబరాలు చేసుకున్నారు.

- Advertisement -

ఈ సందర్బంగా మండల అధ్యక్షుడు వెన్నమనేని శ్రీధర్ రావు మాట్లాడుతూ పార్లమెంటు ఎన్నికల కౌంటింగ్ ఈరోజు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నిర్వహించగా 2లక్షల 25వేల 209 ఓట్ల మెజార్టీతో గెలుపొందారని అన్నారు.

ఇప్పటివరకు కరీంనగర్ పార్లమెంటు స్థానానికి ఇంత భారీ మెజార్టీ రావడం ఇదే ప్రథమమని తెలిపారు. బండి సంజయ్ కుమార్ ను మూడవసారి ఎంపీగా గెలుపును అందించిన ఎంపీ నియోజకవర్గ ప్రజలకు, తంగళ్ళపల్లి మండల ప్రజలకు ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల బిజెపి పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News