Thursday, September 19, 2024
HomeతెలంగాణKoturi Manavatha Rai met CM Revanth: పేద విద్యార్థుల పాలిట దేవుడు సీఎం...

Koturi Manavatha Rai met CM Revanth: పేద విద్యార్థుల పాలిట దేవుడు సీఎం రేవంత్ రెడ్డి

కోటూరి మానవతారాయ్

ప్రభుత్వ బడులను బలోపేతం చేయటానికి కృషి చేస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిని సాయంత్రం తన గృహంలో కలిసి పుష్పగుచ్చం అందించి శాలువాతో సన్మానించి ధన్యవాదాలు తెలిపిన రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు తెలంగాణ విద్యార్థి నిరుద్యోగ జేఏసీ చైర్మన్ కోటూరి మానవతారాయ్ మరియు రాష్ట్ర కన్వీనర్ మేడారపు సుధాకర్ లు.

- Advertisement -

ఈ సందర్భంగా కాంగ్రెస్ నేత నిరుద్యోగ చైర్మన్ మానవతారాయ్ మాట్లాడుతూ ఏకోపాధ్యాయ పాఠశాలలను మూసివేయకుండా ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలకు దీటుగా తీర్చి దిద్దుతామని ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటన చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖింపబడుతుందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ పాఠశాలలో చదివే పేద విద్యార్థుల పాలిటి దేవుడని ఆయన అభివర్ణించారు. ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లెక్క ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దే ఆలోచన చేయలేదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు కాకతీయ యూనివర్సిటీ పరిశోధక విద్యార్థి సంఘం అధ్యక్షులు తాళ్లపల్లి నరేష్ గౌడ్, నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఓయూ నేత పట్ల నాగరాజు, నిరుద్యోగ జేఏసీ గ్రేటర్ హైదరాబాద్ నాయకులు హేమంత్ చౌదరి, కాకతీయ యూనివర్సిటీ నిరుద్యోగ జేఏసీ నాయకులు సుదగాని మధు గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News