Saturday, October 5, 2024
HomeఆటWarangal: కేసీఆర్ పుట్టినరోజుకి క్రికెట్ టోర్నమెంట్

Warangal: కేసీఆర్ పుట్టినరోజుకి క్రికెట్ టోర్నమెంట్

ముఖ్యమంత్రి కేసీఅర్ జన్మదినోత్సవం సందర్భంగా వరంగల్ లో క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించారు హోంమంత్రి మహమూద్ అలీ. కేసీఆర్ క్రికెట్ ఛాంపియన్ ట్రోఫీ కాకతీయ క్రికెట్ అకాడమీ, భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా హోం మంత్రి మాట్లాడుతూ… ప్రతి సంవత్సరము కేసీఆర్ పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకొని క్రికెట్ టోర్నమెంటు నిర్వహించడం ప్రశంసనీయం అని అన్నారు. క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ ప్రతిభను ప్రదర్శించాలని అన్నారు. ప్రతి ఒక్కరూ క్రీడా స్ఫూర్తి ప్రదర్శించి గెలుపోటములు సహజం కాబట్టి స్నేహపూర్వకంగా క్రీడలు ఆడుకోవాలని సూచించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News