Friday, October 18, 2024
Homeనేరాలు-ఘోరాలుRajanna Sirisilla: ప్రభుత్వ టీచర్ సస్పెన్షన్

Rajanna Sirisilla: ప్రభుత్వ టీచర్ సస్పెన్షన్

కలెక్టర్ ఆదేశాలు

అధికారికంగా అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన ఓ ఉపాధ్యాయినిని జిల్లా కలెక్టర్ సస్పెండ్ చేశారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని గీతానగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.

- Advertisement -

ఈ సందర్భంగా తరగతి గదులు పరిశీలించారు. సెలవు విషయమై అధికారికంగా అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన రాధారాణి స్కూల్ అసిస్టెంట్ (మ్యాథ్స్) టీచర్ ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News