Thursday, September 19, 2024
HomeదైవంSrisailam: 29 రోజుల్లో మల్లన్న ఆదాయం 3 కోట్ల పైమాటే

Srisailam: 29 రోజుల్లో మల్లన్న ఆదాయం 3 కోట్ల పైమాటే

ప్రతి నెలా పెరుగుతున్న రాబడి

హుండీల లెక్కింపు ద్వారా దేవస్థానానికి శ్రీశైలం మల్లన్నకు 3,31,70,665/-లు నగదు రాబడిగా లభించింది. కాగా ఆలయ హుండీల రాబడిని భక్తులు గత 29 రోజులలో ( 04.07.2024 నుండి 01.08.2024 వరకు) సమర్పించినది కావడం విశేషం. అలాగే ఈ హుండీలో 127 గ్రాముల బంగారం, 4 కేజీల 400 గ్రాముల వెండి లభించాయి. అదేవిధంగా 489 యుఎస్ఏ డాలర్లు, 4445 యూ.ఏ.ఈ దిర్హమ్సు 5,00,000 వియత్నాం డాంగ్సు, 90 థాయిలాండ్ భట్స్, 108 కత్తార్ రియాల్స్, 1- మలేషియా రింగిట్స్, 15 – సౌదీఆరేబియా రియాల్స్, 20 ఇంగ్లాండు పౌండ్సు, 2 సింగపూర్ డాలర్లు, 5 – యూరోలు మొదలైన విదేశీ కరెన్సీ కూడా ఈ హుండీల లెక్కింపులో లభించాయి.

- Advertisement -

పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య సీసీ కెమెరాల నిఘాతో ఈ లెక్కింపును చేపట్టారు. ఈ కార్యక్రమములో కార్యనిర్వహణాధికారి డి.పెద్దిరాజు, డిప్యూటీ కార్యనిర్వహణాధికారిణి రవణమ్మ, పలువురు శాఖాధిపతులు, ఆయా విభాగాల పర్యవేక్షకులు, సిబ్బంది, శివసేవకులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News