అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలకు సంబంధించిన కేసులో సాక్షి ఛానల్ న్యూస్ యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావు(Kommineni Srinivasa Rao) అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఆయనను గుంటూరు జిల్లా మంగళగిరిలోని కోర్టు ముందు పోలీసులు హాజరుపరిచారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు ఆదేశాల మేరకు కొమ్మినేనిని గుంటూరు జిల్లా జైలుకు పోలీసులు తరలించారు.ఈ నెల 24 వరకు ఆయన జైలులో రిమాండ్ ఖైదీగా ఉండనున్నారు.
కాగా ప్రముఖ ఛానెల్ డిబేల్ లో సీనియర్ జర్నలిస్టు కృష్ణంరాజు అమరావతి మహిళలను ఉద్దేశించి వేశ్యల రాజధాని అంటూ అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద రుమారం రేగుతోంది. దీంతో యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావు, జర్నలిస్ట్ కృష్ణంరాజు, సాక్షి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని తూళ్లూరు పోలీస్ స్టేషన్ లో అమరావతి మహిళలు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు కొమ్మినేనిని అరెస్ట్ చేసిన పోలీసులు.. పరారీలో ఉన్న జర్నలిస్ట్ కృష్ణంరాజు ఆచూకీ కోసం గాలిస్తున్నారు.
మరోవైపు అమరావతి మహిళలపై జర్నలిస్టు కృష్ణంరాజు చేసిన అసభ్యకర వ్యాఖ్యలపై జాతీయ మహిళా కమిషన్ (National women commission) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వ్యాఖ్యలను కమిషన్ సుమోటోగా తీసుకుంది. ఈ మేరకు ఏపీ డీజీపీకి జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ విజయ రహత్కర్ లేఖ రాశారు. ఎలాంటి చర్యలు తీసుకున్నారో మూడు రోజుల్లోగా నివేదికను ఇవ్వాలని ఆదేశించారు.
Kommineni: కొమ్మినేని శ్రీనివాసరావుకు 14 రోజుల రిమాండ్
సంబంధిత వార్తలు | RELATED ARTICLES