Sunday, September 8, 2024
Homeఆంధ్రప్రదేశ్Allagadda: గోమయ గణేష్ విగ్రహాల పంపిణీ

Allagadda: గోమయ గణేష్ విగ్రహాల పంపిణీ

ఆళ్లగడ్డ విశ్వరూప కాలనీలోని వేద ఫిజియో ఆసుపత్రి ఆవరణలో ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ నరేంద్ర దేవ్ , మైత్రేయిల ఆధ్వర్యంలో గోమయంతో తయారు చేసిన గణేష్ విగ్రహాలను పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పర్యావరణం దెబ్బతీయకుండా సహజ సిద్ధమైన ఆవు పేడతో వీటిని తయారు చేసినట్లు తెలిపారు. గోమయంతో చేసిన విగ్రహాలను పూజించడం వల్ల సకల శుభాలు కలుగుతాయని వారు తెలిపారు. గత సంవత్సరం కూడా ఇదేవిధంగా వినాయకులను తయారుచేసి ఉచితంగా పంపిణీ చేశామన్నారు. సుమారు 200 విగ్రహాలను ఈ సందర్భంగా వారు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత రెవెన్యూ అధికారి వెంకట్రావు, పట్టణ పురోహితులు జగన్మోహన్ శర్మ ప్రధానోపాధ్యాయులు రామకృష్ణ , లెక్చరర్ గోపాలరావు సీనియర్ జర్నలిస్టు సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News