Tuesday, September 17, 2024
Homeఆంధ్రప్రదేశ్Amaravati the AI city: ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ సిటీగా అమరావతి

Amaravati the AI city: ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ సిటీగా అమరావతి

90 రోజుల్లో సీఆర్డీయే కార్యాలయ నిర్మాణం పూర్తి

అమ‌రావ‌తి రాజ‌ధాని ఆర్టిఫిషియ‌ల్ ఇంటిలిజెన్స్ (ఏఐ) సిటీగా ఉండాల‌ని, ఆ దిశగా ప్ర‌ణాళిక‌లు రూపకల్పన చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్ప‌ష్టం చేశారు. పురపాలక శాఖ‌ మంత్రి నారాయణ, సీఆర్డీయే అధికారులతో ఆయ‌న గురువారం స‌మీక్ష నిర్వహించారు. ఆర్టిఫిషియ‌ల్ ఇంటిలిజెన్స్ స్పుర‌ణ‌కు వ‌చ్చేలా అమ‌రావ‌తి లోగోను ఆంగ్లంలో అమరావతి పేరులో మొదటి అక్షరం ఏ, చివరి అక్షరం ఐ అక్షరాలు కలిసి వచ్చేలా రూపొందించాలి. రాజ‌ధానిలో ఎటు చూసినా సాంకేతిక సౌల‌భ్యత ఉట్టిప‌డేలా నిర్మాణం జ‌ర‌గాలి. అమ‌రావ‌తి దేవ‌త‌ల రాజ‌ధాని. అలాంటి గొప్ప రాజ‌ధాని ప‌ట్ల గ‌త ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరించి భ్రష్టు పట్టించింది. ఇప్పుడు మ‌ళ్లీ రాజ‌ధాని ప‌నులు వేగంగా పున‌రుద్ధరించాల్సి ఉంది…. అని సీఎం చంద్ర‌బాబు పేర్కొన్నారు. ప్రభుత్వ భవనాల నిర్మాణాలు పూర్తి చేయ‌డానికి ప‌ట్టే స‌మ‌యం, ప‌నులు చేప‌ట్టడానికి టెండ‌ర్లు పిల‌వ‌డం త‌దిత‌ర అంశాల‌పై స‌మీక్షించారు. జీ+7విధానంతో నిర్మాణం తలపెట్టిన సీఆర్డీయే కార్యాలయంను గ‌త టీడీపీ ప్రభుత్వంలో ఏమాత్రం చేప‌ట్టామో అంత‌కుమించి అంగుళం నిర్మాణం కూడా ముందుకు క‌ద‌ల్లేదు. గ‌త ప్రభుత్వం ఈ నిర్మాణాల‌ను పూర్తీగా వ‌దిలేసింది. ఇప్పుడు ఈ భ‌వ‌న నిర్మాణం పూర్తి చేయ‌నున్నాం… అని ముఖ్య‌మంత్రికి అధికారులు వివ‌రించారు. ఈ భ‌వ‌న నిర్మాణాన్ని 90 రోజుల్లో పూర్తీ చేసి కొత్త కార్యాల‌యాన్ని అందుబాటులోకి తేవాల‌ని సీఎం చంద్రాబాబు ఆదేశించారు. భ‌వ‌న నిర్మాణాల‌కు కూడా అత్యాధుని టెక్నాల‌జీల‌ను ఉప‌యోగించి, నాణ్యతలో ఎక్కడా కూడా రాజీ ప‌డ‌కూడ‌ద‌న్నారు.

- Advertisement -

హ్యాపీనెస్ట్‌నూ గ‌త ప్రభుత్వం నిలిపేసింది

హ్యాపీనెస్ట్ లో గ‌త ప్రభుత్వం చ‌ర్యల‌తో ఏర్పడిన న‌ష్టాన్ని పూడ్చేలా విధానాలు రూపొందించాల‌ని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఈ ప్రాజెక్టును మ‌ళ్లీ పున‌రుద్ధరించాల‌న్నారు. టీడీపీ ప్రభుత్వం రాజ‌ధానిలో చేప‌ట్టిన హ్యాపీనెస్ట్ ప్రాజెక్టుపైన ముఖ్యమంత్రి స‌మీక్షించారు. అమ‌రావ‌తి రాజ‌ధాని ప్రాంతంలో నివాసం ఉండాల‌ని కోరుకునే వాళ్ల కోసం 14 ఎక‌రాల్లో హ్యాపీనెస్ట్ ప్రాజెక్టును రూపొందించాం.హ్యాపీనెస్ట్ ప్లాట్లన్నీ అప్పట్లో ఒక్క గంట‌లో అమ్ముడుపోయాయి. 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావ‌డంతో ఆ ప్రాజెక్టుకు గ్రహ‌ణం ప‌ట్టింది. దీనిని నిలిపేయ‌డంతో కొనుగోలుదారులు వెన‌క్కివెళ్లిపోయారు. దీని వ‌ల్ల సీఆర్డీఏకు భారీ న‌ష్టం వ‌చ్చింది… అని అధికారులు వివ‌రించారు. రాజ‌ధానికి సంబంధించి ఇంకా 3,558 ఎక‌రాలు సేక‌రించాల్సి ఉంద‌ని, రాజ‌ధాని ప‌రిధిలోని రెండు గ్రామాల రైతులు భూములు ఇచ్చేందుకు ముందుకొస్తున్నార‌ని చెప్పారు. డెవ‌ల‌ప్ చేసిన ప్లాట్లను ఆ రైతుల‌కు కేటాయించే విష‌యంలో చిన్న చిన్న అభ్యంత‌రాలున్నాయ‌ని వారు వివ‌రించ‌గా రైతుల‌తో మాట్లాడి దాన్ని ప‌రిష్కరించి ముందుకెళ్లాల‌ని సీఎం సూచించారు. రాజధానిలో జంగిల్ క్లియరెన్స్ కోసం 190 హిటాచి మిషన్లు కంప చెట్లను తొలగిస్తున్నాయని, దాదాపు 60 శాతం పూర్తయ్యాయ‌ని అధికారులు వివ‌రించారు. బిల్డింగ్ నిర్మాణం, క్లియరెన్స్ లో టెక్నాలజీని ఉపయోగించాలని సీఎం సూచించారు. జంగిల్ క్లియరెన్స్ మదింపునకు డ్రోన్లను ఉపయోగించాలన్నారు. క్లియరెన్స్ పనులు కూడా డ్రోన్స్ ద్వారా పర్యవేక్షించాలని సీఎం చంద్రబాబు చెప్పారు.

మెట్రో రైలు ప్రాజెక్టు ప‌నులు వేగ‌వంతం

విశాఖ‌ప‌ట్నం, విజ‌య‌వాడ‌లో చేప‌ట్టబోయే మెట్రో రైలు ప్రాజెక్టు ప‌నుల‌ను త్వరిత‌గ‌తిన చేప‌ట్టాల‌ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారుల‌కు చెప్పారు. విశాఖప‌ట్నం మెట్రో ప్రాజెక్టును రెండు ద‌శ‌ల్లో చేప‌డ‌తామ‌ని ఏపీ మెట్రోరైల్ కార్పొరేష‌న్ ఎండీ రామ‌కృష్ణా రెడ్డి వివ‌రించారు. ఫేజ్-1లో 46 కిలో మీట‌ర్ల మేర రూ.11,400 కోట్ల వ్య‌యంతో మెట్రో రైలు నిర్మిస్తామ‌ని, త‌రువాత ఫేజ్‌-2లో 30 కిలోమీట‌ర్ల మేర రూ.5,734 కోట్ల‌తో నిర్మిస్తామ‌న్నారు. ఫేజ్-1 మెట్రో రైలు ప‌నులు మొద‌లు పెట్టి నాలుగేళ్లలోపు పూర్తి చేయాల‌ని సీఎం చంద్రబాబు ఆదేశించారు. విజ‌య‌వాడ‌లో 38 కిలోమీట‌ర్ల మేర రూ.11వేల కోట్లతో చేప‌ట్టబోయే మెట్రో రైలు నిర్మాణ ప్రాజెక్టు ప‌నులను కూడా వేగ‌వంతం చేయాల‌ని సూచించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News