Saturday, October 5, 2024
Homeఆంధ్రప్రదేశ్Ananthapuram: వడ్డిపల్లిలో తోపుదుర్తి ప్రచారానికి భారీ జనం

Ananthapuram: వడ్డిపల్లిలో తోపుదుర్తి ప్రచారానికి భారీ జనం

సంక్షేమ పథకాలపై ఫోకస్

ఆత్మకూరు మండలం వడ్డిపల్లి, తలుపురు గ్రామాల్లో రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి చేపట్టిన ఎన్నికల ప్రచారానికి భారీ సంఖ్యలో తరలివచ్చారు. జడ్పీ చైర్మన్ బోయ గిరిజమ్మతో కలిసి ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఎన్నికల ప్రచారం చేపట్టారు. జగనన్న అమలు చేసిన సంక్షేమ పథకాల ద్వారా ప్రతి కుటుంబం లబ్ది పొందిందని, ఈ పథకాలు ఇలాగే కొనసాగాలంటే మళ్ళీ జగనన్న ముఖ్యమంత్రి కావాలని ఎమ్మెల్యే అన్నారు.

- Advertisement -

హిందూపురం ఎంపీగా బోయ శాంతమ్మ అక్కను, రాప్తాడు ఎమ్మెల్యేగా తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని గ్రామస్తులకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, వైస్ ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, చైర్మన్లు, డైరెక్టర్లు, గృహ సారధులు, మండల నాయకులు, కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News