Friday, September 20, 2024
Homeఆంధ్రప్రదేశ్AP: సీఎంకు థాంక్స్ చెప్పిన గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం

AP: సీఎంకు థాంక్స్ చెప్పిన గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం

23,000 మంది వీఆర్‌ఏలకు లబ్ధి

సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం రాష్ట్ర ప్రతినిధులు. వీఆర్‌ఏలకు 500 డీఏ మంజూరు చేసిన ప్రభుత్వం తమకు గత ప్రభుత్వం డీఏ రద్దు చేసిందని, అప్పట్లో ఇచ్చే డీఏ 300 కూడా రద్దు చేయడంతో తమ ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంతో సీఎం వైఎస్‌ జగన్‌ తమకు న్యాయం చేశారంటూ వీఆర్‌ఏల సంఘం ప్రతినిధులు వివరించారు. ఈ నిర్ణయం వల్ల 23,000 మంది వీఆర్‌ఏలకు లబ్ధి జరుగుతుందని సీఎంకి వివరించి, తమ ఆనందాన్ని ముఖ్యమంత్రితో పంచుకున్నారు ప్రతినిధులు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలిపిన గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం రాష్ట్ర అధ్యక్షడు గరికపాటి బ్రహ్మయ్య, ఉపాధ్యక్షులు జి.టి.రామాంజనేయులు, బి.వెంకట్రావు, పి.రాంబాబు, కోశాధికారి చెన్నుపల్లి సత్యనారాయణ.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News