Sunday, October 6, 2024
Homeఆంధ్రప్రదేశ్AP: గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ కు శౌర్య పతాకం

AP: గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ కు శౌర్య పతాకం

మండ్లెం గ్రామానికి చెందిన సయ్యద్ హబీబుల్లా

ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని 77 వ స్వాతంత్ర దినోత్సవాన్ని విజయవాడ ఇందిరా పార్క్ లోని మున్సిపల్ గ్రౌండ్లో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదు జూపాడు బంగ్లా మండలలోని మండ్లెం గ్రామానికి చెందిన గ్రేహౌండ్ కానిస్టేబుల్ సయ్యద్ హబీబుల్లా ముఖ్యమంత్రి శౌర్య పతాకంతో సత్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రేహౌండ్స్ శాఖ తరపున తన ఉద్యోగ బాధ్యతలను నిర్వహించినందుకు తనకు ముఖ్యమంత్రి శౌర్య పతాకాన్ని అందించారని, ఆగస్టు 15 జండా పండుగ రోజున ఈ పథకం తనకు రావడం చాలా సంతోషంగా ఉందని గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ సయ్యద్ హబీబుల్లా తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News