Thursday, July 4, 2024
Homeఆంధ్రప్రదేశ్AP: జగనన్నే మా భవిష్యత్తు

AP: జగనన్నే మా భవిష్యత్తు

వచ్చే ఎన్నికల్లో వైయస్ జగన్మోహన్ రెడ్డిని గెలిపించాలని ఎమ్మెల్యే కాటసాని నగర మేయర్ బివై రామయ్య అన్నారు. పాణ్యం ఎమ్యెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో పాణ్యం టౌన్ లో నియోజకవర్గ పరిధిలోని, నాలుగు మండలాలు పాణ్యం, గడివేముల, ఓర్వకల్, కల్లూరు మరియు కల్లూరు అర్బన్ లోని సచివాలయ వార్డ్ కన్వీనర్లు, ప్రజాప్రతినిధులు మరియు నాయకులతో జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమం నిర్వహించారు.
సమావేశానుద్దేశించి ఎమ్యెల్యే మాట్లాడుతూ…మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఏమి కావాలో అందించే నిజమైన నాయకుడని, ఇచ్చిన మాటను నెరవేర్చే గొప్ప నాయకుడు,మేనిపేస్టో ని భగవద్గీత, ఖురాన్, బైబిల్ గా భావించి వాటన్నిటినీ ఇప్పటికే 95 శాతం నెరవేర్చిన గొప్ప ముఖ్యమంత్రి మన నాయకుడు వైఎస్ జగన్ అన్నారు.

- Advertisement -

మన పాణ్యం నియోజకవర్గ పరిధిలోని వార్డ్ కన్వీనర్లు,గృహ సారధులను కలుపుకుని మీ మీ పరిధిలో ఉన్న ప్రతీ ఇంటికి వెళ్లి గత ప్రభుత్వానికి మన జగనన్న ప్రభుత్వానికి తేడా ఉందా,లేదా అని,ఈ ప్రభుత్వంలో మీకు అందిన సంక్షేమ పథకాలు చూసి ఈసారి మీరు మా జగనన్నను ఓటేయండి అని అడగాలన్నారు.
ఈ కార్యక్రమంలో కర్నూలు నగర మేయర్ బీవై. రామయ్య, డిప్యూటీ మేయర్, సిద్ధారెడ్డి రేణుక, మార్కెట్ యార్డ్ చైర్మన్ మీదివేముల ప్రభాకర్ రెడ్డి, నాలుగు మండలాల జడ్పీటీసీలు, సర్పంచులు, ఎంపిటిసిలు, కార్పొరేటర్లు, నాలుగు మాండలాల, కల్లూరు అర్బన్ జె.సి.ఎస్ కన్వీనర్లు, మండలాల ఇంచార్జ్ లు పలువురు వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News