Sunday, June 23, 2024
Homeఆంధ్రప్రదేశ్AP rains: బంగాళాఖాతం వరకు ద్రోణి

AP rains: బంగాళాఖాతం వరకు ద్రోణి

రాయలసీమ నుండి మధ్య బంగాళాఖాతం వరకు ద్రోణి కొనసాగుతుందని విపత్తుల సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ తెలిపారు. దీని ప్రభావంతో రేపు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.

- Advertisement -

ఎల్లుండి పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అలాగే శ్రీకాకుళం, విజయనగరం, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, వైయస్ఆర్, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు మరియు తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.

ఉరుములతో కూడిన వర్షం పడేపుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశు-గొర్రెల కాపరులు చెట్లు, పోల్స్, టవర్స్ క్రింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని సూచించారు.

శుక్రవారం సాయంత్రం 5 గంటల నాటికి విజయనగరం జిల్లా రాజాం 77మిమీ, సంతకవిటి 62మిమీ, అనకాపల్లి జిల్లా నర్సీపట్నం 61.5మిమీ,కోటవురట్ల 55మిమీ, చీడికాడ 31మిమీ, శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల 29 మిమీ, మన్యం జిల్లా సాలూరు 27.5మిమీ చొప్పున వర్షపాతం నమోదైందన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News