Saturday, October 5, 2024
Homeఆంధ్రప్రదేశ్BJP: టిడిపి-వైసిపిలు దొంగ పార్టీలు

BJP: టిడిపి-వైసిపిలు దొంగ పార్టీలు

కుటుంబ, కుల-మత వైసిపి, టిడిపిలకు చరమ గీతం పాడండి-బీజేపీ

టిడిపి-వైసిపిలు దొంగ పార్టీలే అని కుటుంబ, కుల మత పాలన కొనసాగిస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని కేంద్ర టెలి కమ్యూనికేషన్, అండ్ ఐటి శాఖ మంత్రి దేవు సిన్హా, బిజేపి జాతీయ కార్యదర్శి, రాష్ట్ర సహ ఇంఛార్జి సునీల్ దియోదర్ అన్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణం తేరు బజార్ లో బిజేపి ప్రభుత్వం ఏర్పడి 9 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మహాజన సంపర్క్ అభియాన్ సభ ఎమ్మిగనూరు నియోజకవర్గ బిజేపి కన్వీనర్ కేఅర్ మురహరి రెడ్డి అద్యర్వంలో జరిగిన సభ విజయవంతం అయింది.

- Advertisement -

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాబు వస్తే జాబ్ వస్తుంది అని చెప్పారు. కానీ నారా లోకేష్ కు ఉద్యోగం వచ్చింది. యువతకు రాలేదు. జగన్ వేస్తే ఉద్యోగాలు వస్తాయని చెప్పారు కానీ రాలేదు. జగన్ పోవాలని ప్రజలు ఎదురు చూస్తున్నారు. వైసిపి పాలనలో పాస్టర్స్, మౌలానాలకు జీతాలు ఇస్తూ మత మార్పిడి చేస్తున్నారు. తెలుగు మీడియం స్కూల్ లను మూసివేసి ఇంగ్లీష్ స్కూళ్లు ఏర్పాటు చేశారు. తెలుగు మాత్ర భాషను మరిచిపోయేలా చేశారు. ఇంగ్లీష్ మీడియం స్కూల్ లను క్రిస్టియన్ మిషనరీ స్కూళ్లుగా మార్చే కుట్ర జగన్ చేస్తున్నారు. బిజేపి అధికారంలోకి వస్తే వాటిని రద్దు చేస్తాం. మసీదులును, చర్చిలను చట్ట విరుద్ధంగా నిర్మిస్తున్నారని వాటిని చట్టబద్దం చేయడానికి జగన్ ప్రయత్నం చేస్తున్నారు.

హిందువులను మత మార్పిడి చేయడానికి కుట్ర చేస్తున్నారు. కేరళ లో గత 50 ఏళ్లుగా మత మార్పిడిలు జిహాదీ ప్రేమ వివాహాలు జరిగాయి. అలాంటిదే ఆంధ్రలో జరుగుతున్నాయి. జగన్ వీరిని వెనక వేసుకొస్తున్నారు. మోడీ ప్రభుత్వంలో హిందూ, ముస్లిం, క్రైస్తవులు అందరూ సమానమే. బిజేపి పాలనలోనే దేశ అభివృద్ధి సాద్యం. 9 ఏళ్ల మోడీ పాలనలో ప్రపంచ దేశాలతో పాటు మన దేశం గర్వించే విధంగా ఉందని వారన్నారు. రాయలసీమకు త్రాగు-సాగు నీరు ఇవ్వడానికి ప్రాజెక్టులు నిర్మించాలని డిమాండ్ చేశారు.

కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు చంద్రమౌళి, నాయకులు నీలకంఠ, రామస్వామి, డాక్టర్ పార్థ సారథి, కపిలేశ్వరయ్య, నరసింహ వర్మ, డాక్టర్ వి రెడ్డి, మురళి, పురుషోత్తమ రెడ్డి, కే అర్ రాజగోపాల్ రెడ్డి, విట్టా రమేష్, కిరణ్ కుమార్ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News