కేంద్ర బడ్జెట్ను ఏపీ సీఎం చంద్రబాబు(Chandrababu)స్వాగతించారు. ఈ బడ్జెట్ ప్రధాని మోదీ(PM Modi) నేతృత్వంలోని వికసిత్ భారత్ దార్శనికతను ప్రతిబింబిస్తోందని తెలిపారు. ఈమేరకు ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.
“ప్రజా అనుకూల ప్రగతిశీల బడ్జెట్ను నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. మహిళలు, పేదలు, యువత, రైతుల సంక్షేమానికి ప్రాధాన్యతనిచ్చారు. రాబోయే ఐదేళ్లలో వృద్ధికి ఆరు కీలక రంగాలను బడ్జెట్ గుర్తించింది. జాతీయ శ్రేయస్సు దిశగా ఈ బడ్జెట్ కీలక అడుగులు సూచిస్తోంది. దేశానికి సుసంపన్నమైన భవిష్యత్తును వాగ్దానం చేస్తూ సమగ్రమైన బ్లూప్రింట్గా పనిచేస్తుంది. దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అయిన మధ్యతరగతి ప్రజలకు పన్ను మినహాయింపును ఇస్తుంది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు అభినందనలు” అని చంద్రబాబు ట్వీట్ చేశారు. కాగా ఈ బడ్జెట్లో ఏపీలో పోలవరం ప్రాజెక్టుతో పాటు, విశాఖ స్టీల్ ప్లాంట్, విశాఖ పోర్టు, రోడ్లు, వంతెనల నిర్మాణానికి నిధులు కేటాయియించిన సంగతి తెలిసిందే.