Saturday, October 5, 2024
Homeఆంధ్రప్రదేశ్Jagan distributes Tabs to 8th class kids: 8వ తరగతి విద్యార్థులకు ఉచితంగా...

Jagan distributes Tabs to 8th class kids: 8వ తరగతి విద్యార్థులకు ఉచితంగా ట్యాబ్ లు

జనవరికల్లా అన్నీ డిజిటల్ క్లాస్ రూములే

8వ తరగతి విద్యార్థులకు ఉచితంగా ట్యాబ్ లు

- Advertisement -

అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లిలో బైజూస్ ప్రీలోడెడ్ కంటెంట్ తో కూడిన ట్యాబ్ లును ఉచితంగా 8వ తరగతి విద్యార్ధులకు పంపిణీ చేసే కార్యక్రమంలో భాగంగా.. ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాల విద్యార్ధులతో ముచ్చటించిన ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌.

ఒకవేళ ట్యాబులు చెడిపోతే.. ట్యాబులు రిపేరీ చేయటం లేదా కొత్త ట్యాబును ఇస్తామని జగన్ వెల్లడించారు. కేవలం పాఠాలు, వాటికి సంబంధించిన విషయాలు మాత్రమే తెలిసేలా సాఫ్ట్ వేర్ ఉందని, తల్లిదండ్రులకు ట్యాబులపై ఎటువంటి ఆందోళన, భయం అక్కర్లేదని తెలిపారు జగన్. 17,500 రూపాయల విలువైన ఈ ట్యాబ్లెట్లలో బైజూస్ కంటెంట్ తో ఇచ్చి తాము ఉచితంగా పిల్లలకు అందజేసి, వారి చదువుకు సాయపడుతున్నామన్నారు. ట్యాబు ధర, బైజూస్ కంటెంట్ కలిపితే మార్కెట్లో దీని విలువ 33,000 రూపాయలని సగర్వంగా చెప్పారు సీఎం జగన్. రాష్ట్ర పిల్లలు పోటీ పడి నంబర్ 1గా నిలబడాలని మాత్రమేనంటూ జగన్ వెల్లడించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News