Monday, May 20, 2024
Homeఆంధ్రప్రదేశ్Emmiganuru: ఎమ్మిగనూరులో 'మేము సిద్దం' బహింగ సభ

Emmiganuru: ఎమ్మిగనూరులో ‘మేము సిద్దం’ బహింగ సభ

గెలిచేది వైసీపీనే అంటూ ధీమా

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరుకు సీఎం జగన్ వస్తున్నట్లు వైసిపి జిల్లా కో ఆర్డినేటర్ రామ సుబ్బారెడ్డి తెలిపారు. స్థానిక వీవర్స్ కాలని గ్రౌండ్ ను పరిశీలించారు. మేముసిద్ధం బహిరంగ సభ కోసం గ్రౌండ్ లో ఏర్పాటు చేసే సభా ప్రాంగణాన్ని వైసీపీ జిల్లా కోఆర్డినేటర్ రామసుబ్బారెడ్డి , ఎమ్మెల్సీ మధుసూదన్ రెడ్డి , కర్నూలు ఎంపీ అభ్యర్థి బివై రామయ్య , ఎమ్మిగనూరు ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి , ఎమ్మెల్యే అభ్యర్థి బుట్టారేణుక , నియోజకవర్గ సీనియర్ నాయకుడు ఎర్రకోట జగన్ మోహన్ రెడ్డి, బుట్టా శివనీలకంఠ , బుట్టా ప్రతూల్ లు పరిశీలించారు.

- Advertisement -

అనంతరం స్థానిక ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవ రెడ్డి స్వగృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలని సీఎం జగన్మోహన్ రెడ్డి నవరత్నాలలో భాగంగా అనేక సంక్షేమ పథకాలను అందిస్తున్న ఏకైక సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నారు. ప్రజాక్షేత్రంలో పాల్గొనటానికి ఈ నెల 29న ఎమ్మిగనూరు కు మేము సిద్దం బహిరంగ సభకు వస్తున్నారని వారు వెల్లడించారు. టీడిపి పార్టీ అధినేత చంద్రబాబు మూడు సార్లు ముఖ్య మంత్రిగా కొనసాగినా అభివృద్ది అంటే ఏమిటో అర్థం కాలేదని, మళ్ళీ బిజెపి, జనసేన పార్టీలతో పొత్తులు పెట్టుకుని ఒక మేనిఫెస్టో లేక ఏమి చేయాలో తెలియక అయోమయంలో పడిపోయిందని ఎద్దేవా చేశారు. ప్రజలు అఖండ మెజారిటీతో ఆశీర్వదించేది వైసిపి పార్టీని అని, కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని ధీమా వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News