Sunday, July 7, 2024
Homeఆంధ్రప్రదేశ్Emmiganuru: పెత్తందారుల కొమ్ము కాస్తున్న చంద్రబాబు

Emmiganuru: పెత్తందారుల కొమ్ము కాస్తున్న చంద్రబాబు

బడుగు బలహీన వర్గాల ప్రజలను కించపరచేలా మీకు ఇచ్చే సెంటు భూమి శవం పూడ్చడానికి సరిపోతుందంటూ చంద్రబాబు నాయుడు చేసిన అప్రజాస్వామిక, అహంకారపూరిత ఉన్నాయని వైసిపి నాయకుడు ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి అన్నారు. స్థానిక వైఎస్ఆర్ ఎమ్మిగనూరు మండల కన్వీనర్ బిఆర్ బసిరెడ్డి ఆధ్వర్యంలో స్థానిక మండల ఆఫీను అవరణ నుండి వైయస్సార్ సర్కిల్ మీదుగా సోమప్ప సర్కిల్ వరకు “నిరసన ర్యాలీ” నిర్వహించి, అనంతరం చంద్రబాబు నాయుడు దిష్టిబొమ్మను దహనం చేశారు.
ఈ సందర్భంగా ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతి సామాన్యుడు‌ ప్రతి పేదవాడు సుఖంగా జీవించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ద్వారా పలు సంక్షేమ పథకాలను అందజేస్తూ వారి జీవితాల్లో వెలుగు నింపేలా, వారి జీవన ప్రమాణ స్థాయి పెరిగేలా పరిపాలన చేస్తున్నారన్నారు. ప్రతి పేదవాడు సొంత ఇల్లు కట్టుకొని ఇంగ్లీష్ మీడియం చదువులు చదివి చదివిస్తున్నారు.అన్ని సామాజిక వర్గాలు ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీలు అమరావతిలో సొంత గూడు ఏర్పరచుకొని నివాసం ఉండేలా వైయస్ జగన్ పోరాడారని, వారం రోజుల్లోపు ఆయా పేదలకు అమరావతిలో ఉచిత ఇంటి స్థలాలు కూడా అందజేయడం జరుగుతుందన్నారు. కేవలం తన బినామీలైన కొంతమంది కార్పొరేట్ పెత్తందారులు మాత్రమే లాభపడాలని మిగతా పేద వారందరూ పేదవారిగానే మిగిలిపోవాలన్నదే చంద్రబాబు నాయుడి ఉద్దేశమన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ నజీర్ అహ్మద్, టౌన్ బ్యాంక్ చైర్మన్ కొమ్ము రాజశేఖర్, ఎంపిపి గొల్ల కేసన్న, కోపరిటివ్ చైర్మన్ షబ్బీర్, వైస్ ఎంపిపి పోలయ్య, నాయకులు బోయ బజారి, భాస్కర్, నాగేసప్ప పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News