Saturday, November 15, 2025
Homeఆంధ్రప్రదేశ్Gandikota: ఒబెరాయ్ హోటల్ శంకుస్థాపన చేసిన జగన్

Gandikota: ఒబెరాయ్ హోటల్ శంకుస్థాపన చేసిన జగన్

గండికోట, తిరుపతి, విశాఖపట్నంలో ఒబెరాయ్ సెవెన్ స్టార్స్ హోటల్స్

వైయస్సార్ జిల్లా గండికోటలో సీఎం వైఎస్ జగన్ పలు కార్యక్రమాల్లో బిజీగా పాల్గొన్నారు. గండికోట వద్ద ఒబెరాయ్ హోటల్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు ముఖ్యమంత్రి వైయస్ జగన్. మూడు చోట్ల సెవెన్ స్టార్ హోటల్స్ నిర్మాణం చేపట్టనుంది ఒబెరాయ్ గ్రూప్. గండికోట, తిరుపతి, విశాఖపట్నంలో సెవెన్ స్టార్స్ హోటల్స్ నిర్మిస్తుండగా గండికోటలో భూమి పూజ చేశారు సీఎం వైయస్. జగన్. విశాఖ, తిరుపతి ఒబెరాయ్ హోటల్స్ కు వర్చువల్ గా శంకుస్థాపన చేశారు ముఖ్యమంత్రి. అనంతరం వ్యూ పాయింట్ ను పరిశీలించారు జగన్.

- Advertisement -

డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, పర్యాటక శాఖ మంత్రి ఆర్ కె రోజా, పురపాలక పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, సీఎస్ డాక్టర్ కె ఎస్ జవహర్‌రెడ్డి, పర్యాటకశాఖ స్పెషల్ సీఎస్ రజత్ భార్గవ్, ఒబెరాయ్ హోటల్స్ ఎండీ విక్రమ్ జిత్ సింగ్ ఒబరాయ్, పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad